పత్తి తీతలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. గత వారం నుంచి కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్కు రోజూ 10,000 క్వింటాళ్ల నుంచి 16,000 క్వింటాళ్ల సరకు వస్తోంది. అమ్ముకుందామని పత్తి తీసుకెళ్లిన రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. సీజన్ ఆరంభంలోనే క్వింటాల్కు రూ.3,000 తక్కువగా లభిస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా..వీరికి కల్పించిన రాయితీ కోసం ఆర్టీసీకి ప్రభుత్వం ఎంత చెల్లించాలన్నదానిపై స్పష్టత రావడంలేదు. ఆర్థికశాఖ, ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశమైనా..
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఏపీ శాఖ ఛైర్మన్ వై.డి.రామారావు.. రెడ్క్రాస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాఖల నుంచి రెండేళ్ల పదవీ కాలానికి 12 రాష్ట్రాల సభ్యులు ఎన్నికయ్యారు.
మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు కారణంగా రెండేళ్లలోపు చిన్నారులు పలువురు మరణించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహనతో నడుచుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
విశాఖలో దక్షిణాసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్ నిర్మాణానికి గూగుల్ టెక్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందం ‘గేమ్ ఛేంజర్’ కాబోతోందని తెదేపా ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు.
భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా బియ్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్రం పెంచిందని ఎఫ్సీఐ రాష్ట్రస్థాయి సంప్రదింపుల కమిటీ ఛైర్మన్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో 30 లక్షల టన్నుల బియ్యం సేకరణకు అనుమతించిందని వివరించారు.
స్వర్ణముఖి నది పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్ని వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచరుడు కబ్జా చేశాడని తిరుపతి జిల్లా వేదాంతపురానికి చెందిన పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేశారు.
నకిలీ మద్యం వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ, సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి, సాంకేతిక సేవల విభాగం ఎస్పీ మలికాగార్గ్ను సభ్యులుగా నియమించింది.
ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు, వినూత్న ఆవిష్కరణలతో వచ్చే వారిని సమన్వయం చేసేందుకు ఐటీ సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా డ్రైవర్లు నడిపే 30 ఎలక్ట్రిక్ ఆటోలను సీఆర్డీఏ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. మహిళా డ్రైవర్లను అభినందించారు. అమరావతిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు సీఆర్డీఏ..
మద్యం అసలుదో నకిలీదో! ఎప్పుడు.. ఎక్కడ తయారయిందనే వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్’ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఐపీఎస్ అధికారి సంజయ్కు ఏసీబీ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన రెండోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
పిల్లలూ రకరకాల పక్షులను ప్రత్యక్షంగా చూడాలని ఉందా..? వీటి గురించిన ప్రత్యేకతలు నిపుణులు చెబుతుంటే వినాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ (ఐసర్-తిరుపతి)లోని పక్షుల పరిశోధన విభాగం ఆసక్తి ఉన్న చిన్నారులకు ఆహ్వానం పలుకుతోంది.
గుంటూరు నగరానికి చెందిన కందిపప్పు కమీషన్ ఏజెంట్ సంస్థ, ఇంట్లో ఆదాయ పన్ను అధికారులు జరిపిన సోదాల్లో రూ.45 కోట్ల నగదు, వందకు పైగా బంగారం బిస్కెట్లు, కోట్ల రూపాయల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన ప్రామిసరీ నోట్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
పోలవరం ప్రాజెక్టులో ప్రధాన రాతి, మట్టి డ్యాం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డయాఫ్రం వాల్పై ప్రధాన డ్యాంను నిర్మించాల్సి ఉంది. నవంబరు నుంచి ప్రధాన డ్యాం పనులను చేపట్టాలనేది ప్రణాళిక.
శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే కోతులు, ఉడతలు, పిల్లులు తరచూ రైల్వే విద్యుత్తు స్తంభాలు ఎక్కి విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నాయి. వాటిని షాక్ నుంచి రక్షించాలని అధికారులు నిర్ణయించారు.
కొండ కోనల నడుమ మనుగడ సాగించే గిరిజనుల జీవన చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఆదివాసీల కట్టుబాట్లు, సంప్రదాయాలు, అలవాట్లు ఆసక్తి కలిగిస్తాయి. అవన్నీ దగ్గరగా చూడాలనుకున్న వారికి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని గిరిజన మ్యూజియం కొత్త అనుభూతిని పంచుతుంది.
‘ఆడవాళ్లందరూ మందు తాగుతూ తమ ప్రవర్తనను ప్రపంచానికి చూపుతున్నారు’ అని పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కళ కొత్తరూపు సంతరించుకుంటోంది. గతంలో కొన్ని రకాల బొమ్మలకే పరిమితమైన కళాకారులు వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పుట్టినరోజులు, పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న రీతిలోనే కొందరు చావును కూడా అదే స్థాయిలో జరిపించేలా ఆసక్తి చూపిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయామనే బాధ ఒకవైపు ఉన్నా..
పచ్చగా మెరిసిపోతూ చెట్టు కొమ్మపై సేదతీరుతున్న ఈ పాము పేరు స్పాట్ టెయిల్డ్ పిట్ వైపర్. పొడ పాము జాతికి చెందిన ఈ సర్పం పగటి పూట ఎవరికీ కనిపించకుండా నిద్రావస్థలో ఉండి, రాత్రి వేళల్లో వేటాడుతుంది. మడ అడవుల్లో మాత్రమే నివసించే ఈ పాము..
కొంతమంది ప్రభుత్వ అధికారులు కోర్టు విచారణలంటే లెక్కలేకుండా, విచారణలపై గౌరవం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పదవీవిరమణ వయసు 60 నుంచి 62కి పెంచే వ్యవహారాన్ని నిర్లక్ష్యపూరితంగా 62 నుంచి 65 ఏళ్ల పెంపుగా ఆర్థికశాఖ ఉద్యోగులు పేర్కొనడాన్ని తప్పుపట్టింది.
ప్రధానమంత్రి మోదీ ఈ నెల 16 న కర్నూలులో జరిగే భారీ సభ లో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా తొమ్మిది మంది మంత్రులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు సంచార ర్యాపిడ్ కిట్లు(ఎంఆర్కె) తీసుకొచ్చినట్లు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వీటి ద్వారా పీడీఎస్ బియ్యం అవునో కాదో నిర్ధారించవచ్చన్నారు.
జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి కోట వినుత డ్రైవర్ రాయుడు తనపై ఆరోపణలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోపై లోతైన దర్యాప్తు జరపాలని స్థానిక తెదేపా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ వీడియో ఏఐతో సృష్టించిందా?
విద్యుత్తు ఉద్యోగులతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. విజయవాడలోని విద్యుత్తు సౌధలో యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ఐకాస మధ్య సోమవారం సాయంత్రం రెండున్నర గంటల పాటు చర్చ జరిగింది. ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఐకాస నేతలు ప్రకటించారు.
తమను కుట్రపూరితంగా హత్య కేసులో ఇరికించారని, దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు వస్తానని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కోట వినుత పేర్కొన్నారు.
పోలీసులిచ్చిన నోటీసులను లెక్కచేయకుండా వ్యవహరించిన వైకాపా నాయకులు ఎట్టకేలకు దిగొచ్చారు. మాజీ మంత్రి, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని), మరికొందరు సోమవారం మచిలీపట్నం పోలీస్స్టేషన్కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.
ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో తయారైన నకిలీ మద్యం సీసాలకు అంటించిన లేబుళ్లను హైదరాబాద్లో పలువురి సాయంతో జనార్దన్రావు ్బఏ1్శ ముద్రించి తరలించేవాడు. వీటిని పలువురి నుంచి సమకూర్చడంలో రవి ్బఏ4్శ కీలక పాత్ర పోషించాడు.
మద్యం కుంభకోణం కేసు కీలకదశలో ఉందనీ.. దర్యాప్తులో ఇంకా పలు ముఖ్యమైన అంశాలు రాబట్టాల్సి ఉందనీ, నిందితులకు రిమాండ్ పొడిగించాలని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్రప్రసాద్ వాదించారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి పరకామణిలో జరిగిన అక్రమాలు, లోక్ అదాలత్లో కేసు రాజీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేయాలని సెప్టెంబర్ 19న ఇచ్చిన ఆదేశాలను పోలీసు శాఖ, డీజీపీ పట్టించుకోకపోవడంపై హైకోర్టు మండిపడింది.
చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసు అధికారులపైనా చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని ఒప్పుకొనే ప్రసక్తి లేదంది. కోర్టులు, కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులతో ఎలా మెలగాలో పోలీసు అధికారులకు సూచనలు చేయాలని విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్కుమార్ను మౌఖికంగా ఆదేశించింది.
మదనపల్లె.. ప్రశాంతమైన పట్టణం.. విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే నేడు ఈ పట్టణాన్ని కలవరపెడుతున్న అంశం ఆత్మహత్యలు. రోజుకు కనీసం ఇద్దరు చొప్పున బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆందోళనకర అంశం. రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతంగా మారుతోంది.
ఎన్డీయే ప్రభుత్వం జీఎస్టీని తగ్గించటం ప్రజలకు పండగలాంటిదని శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పేర్కొన్నారు. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో సోమవారం పట్ణణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం పది మంది మంత్రులతో సోమవారం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పదోన్నతులు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులతో విలీనం చేయడం తదితర అంశాలపై ఉప సంఘం అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి చైతన్యబాబు(ఏ-22)ను ఎక్సైజ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పీటీఎం మండలం చెండ్రాయునిపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఏ-13 సురేంద్రనాయుడుకు చెందిన ఆంధ్రా వైన్స్ దుకాణంలో చైతన్యబాబు పనిచేస్తున్నాడు.
నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి పూర్తిగా వెనుదిరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు కొత్త ఆలోచనలకు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రపంచ వాణిజ్యంలో దేశ వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని అధికారులకు సూచించారు.
‘జగన్ జమానాలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగుచూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారీ జరిగిపోతోందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలి.
రాష్ట్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా నమోదవుతున్నాయి. బీటెక్, బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీలతోనే ఉద్యోగాలు వస్తుండడంతో చాలామంది పీజీపై ఆసక్తి చూపట్లేదు. చాలామంది స్థానికంగా పీజీ చేయడం కంటే విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు అధ్యక్షత వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో భాగంగా దేశ,
రాజధాని అమరావతి రైతులు చేసిన త్యాగానికి రెట్టింపు ఫలాలు దక్కేలా చేస్తామని, అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. సీఆర్డీఏ భవనం ప్రారంభం ద్వారా రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని సీఎం అన్నారు.
మచిలీపట్నం సీఐపై పోలీస్ స్టేషన్లోనే రంకెలు వేసిన మాజీ మంత్రి పేర్ని నాని.. నేడు అదే ఠాణాలో ఎస్సైతో పరాచకాలు ఆడటం వైకాపా కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.
భార్య వండిన కూరలో ఉప్పు తక్కువైందని... ఓ భర్త పార్టీలో భర్త తనకు నచ్చిన డ్రెస్ వేసుకోలేదని... ఓ భార్య గొడవలు పడి విడాకుల దాకా వెళితే చిన్న వయసు కదాని సరిపెట్టుకోవచ్చు.
హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) హిందూపురం పట్టణం, కిరికెర పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్ దీప కాంతుల్లో వెలుగులు నిండిన సీఆర్డీఏ కార్యాలయ భవనం దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.