సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్(52) ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపణలున్న హరియాణా డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్ర రూపందాల్చుతోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై 2017లో నమోదైన ఐఆర్సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు నమోదు చేసింది.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి మద్దతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 20 మందిని విడుదల చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2022లో నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా భారత సైన్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ లఖ్నవూ కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు నవంబరు 20 వరకూ పొడిగించింది.
ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 1950లతో పోలిస్తే 67 శాతం తగ్గినప్పటికీ యువత మరణాల్లో ఆ స్థాయిలో తగ్గుదల లేదని ఓ అధ్యయనం పేర్కొంది. ఆత్మహత్యలు, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వినియోగమే ఇందుకు కారణాలని పేర్కొంది.
ఉత్తరాఖండ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఓ నిబంధనను సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర పత్రాలను ఉపయోగించి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ఐ అనే అంకుర సంస్థ సోమవారం తెలిపింది.
బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశలో పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్లు వేయడానికి మరో నాలుగురోజులే మిగిలి ఉన్న తరుణంలో ప్రధాన కూటములైన ఎన్డీయే, ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సింగూర్లో టాటా నానో కార్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది.
ఆధునిక చికిత్సారీతుల్ని అనుసరిస్తున్న ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ల పదవీ విరమణ వయసు, ప్రభుత్వ అయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి(ఆయుష్) వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసుకన్నా భిన్నంగా ఉండాలా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వు చేసింది.
దేశంలో న్యాయాధికారులుగా చేరుతున్న వారిలో 60 శాతం మంది మహిళలేనని, వీరందరూ తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుతున్నారే తప్ప రిజర్వేషన్ల ద్వారా కాదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు గుజరాత్ ‘రోల్ మాడల్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరుచూ వల్లె వేస్తారు. అయితే, గుజరాత్ మాడల్.. ఓ మేడి పండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతెల్లం చేశాయి.