Praful Patel బీజేపీతో కలిసి ఉన్న ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ ఎలాంటి తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేవని సీబీఐ తేల్చింది. ఎయిర్ ఇండియాకు విమానాలు లీజు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసు ముగి�
Loksabha Elections కాంగ్రెస్ పార్టీని నిధుల కొరత వెంటాడటం లేదని, ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.
'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో శుక్రవారంనాడు రోడ్షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్గానో, స్టార్గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.
తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓ చోట ఆన్స్ర్ షీట్ చూపించలేదనే కారణంతో విద్యార్థిపై తోటి స్నేహితులు దాడికి దిగారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలో మార్చి 26న జరిగింది.
[17:25] లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.