Kannada News: సతీష్కు ఏడాది క్రితం పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య ఏడు నెలల గర్భంతో ఉంది. పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తలు ఇద్దరూ ఎన్నో కలలు కంటూ ఉన్నారు. సతీష్ భార్యకు తాజాగా, శ్రీమంతం నిర్వహించారు.
India Airspace Ban Pakistan: భారత ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. భారత గగనతలంలో దాయాది విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.
రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించబోతోంది ఆర్బీఐ. దీంతో ఇక, సొమ్ములే సొమ్ములన్నమాట.
రూ. 2.69 లక్షల కోట్ల డివిడెండ్ ఇవ్వబోతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించబోతోంది ఆర్బీఐ. దీంతో ఇక, సొమ్ములే సొమ్ములన్నమాట.
రూ.12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Hindu Muslim Wedding In Pune: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం అని పదే పదే చెప్పడం వినే ఉంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. వర్షం కారణంగా ఆగిపోయిన హిందూ జంట వివాహం కోసం పెళ్లి మండపాన్ని పంచుకునేందుకు ముందుకొచ్చింది ఓ ముస్లిం కుటుంబం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎస్ ఓకా చరిత్రనే మార్చారు. పదవీ విరమణ రోజు సాంప్రదాయాల్ని పక్కనపెట్టి పనే పరమావధి అని చేసి చూపించారు. తల్లి చనిపోయి ఒక్క రోజు కూడా గడవకముందే కోర్టుకు వచ్చి 11 తీర్పులిచ్చారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎఎస్ ఓకా చరిత్రనే మార్చారు. తన పదవీ విరమణ రోజు సాంప్రదాయాల్ని పక్కనపెట్టి పనే పరమావధి అని చేసి చూపించారు. తల్లి చనిపోయి ఒక్క రోజు కూడా గడవకముందే కోర్టుకు వచ్చారు. 11 తీర్పులిచ్చారు.
₹12,000 కోట్ల ఫ్రాడ్ కేసులో జేపీ ఇన్ఫ్రాటెక్, జేపీ అసోసియేట్స్, ఇతరులపై ఈడీ దాడులు చేసింది. సదరు సంస్థలు, వ్యక్తుల ఇళ్లపై మనీలాండరింగ్ దర్యాప్తులో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు మూడు చెరువుల నీళ్లు తాగించిన భారత్.. అంతర్జాతీయంగానూ శత్రుదేశాన్ని ఏకాకిని చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే దౌత్య యుద్ధాన్ని షురూ చేసింది. పాకిస్థాన్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపించింది.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా పాకిస్థాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఇలా పాకిస్థాన్ అనేక దాడులను భారత్ తిప్పికొట్టినట్లు గుర్తుచేశారు షా. బీఎస్ఎఫ్ 22వ పదవీ పురస్కార కార్యక్రమానికి ఢిల్లీలో హాజరైన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక అంశాలపై ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఓ వైవిధ్యం ఉందన్నారు. అదే ఆయా రాష్ట్రాలకు బలమని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్లో వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న యువకులకు కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదల అవగానే వారంతా బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
దేశ వ్యాప్తంగా యువతను ఆకర్షిస్తున్న బెట్టింగ్ యాప్స్ (betting apps) నిషేధంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో హాట్ టాపిక్గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (Rahul Gandhi DU Visit) సందర్శించడం పట్ల DU అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన అని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై త్వరలో జరిగే పార్టీ మహానాడులో ప్రకటిస్తానని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. జనవరి 9వ తేదీ కడలూరులో నిర్వహించనున్న పార్టీ మహానాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, పార్టీ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మైసూర్ శాండల్ (Mysore Sandal) సబ్బుకు తమన్నా భాటియా(Tamannaah Bhatia)ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. దీంతో స్థానిక హీరోయిన్లైన రశ్మిక, శ్రీనిధి శెట్టి సహా పలువురి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సినీ నటుడు విజయ్ ఏర్పాటుచేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఒకే గుర్తు (కామన్ ఎలక్షన్ సింబల్) దక్కించుకునేలా ఆ పార్టీ అధినేత విజయ్ దృష్టిసారించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 66 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అలాగే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
Encounter: ఛత్తీస్గఢ్లో వరుసగా మూడో రోజు ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో వారు కూబింగ్ నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందాడు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు రహస్యంగా వచ్చారనే సమాచారం తెలుసుకుని, భారత సైన్యం రంగంలోకి దిగింది.
జమ్మూ కశ్మీర్ కిష్త్వార్లో (Jammu Kashmir Encounter) నేడు (మే 23, 2025న) కూడా ఉగ్రవాదులతో రెండోరోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం చెందాడు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు మళ్లీ దాడులకు పాల్పడగా, భారత సైన్యం రివర్స్ ఎటాక్ చేస్తోంది.
India Vs Pakistan: భారత్కు వ్యతిరేకంగా పాక్ మిలటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన.. లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్ చేసిన వ్యాఖ్యలే దాదాపుగా ప్రస్తావించారు.
ఛత్తీస్గఢ్లోని మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్ను సీపీఎం తీవ్రంగా ఖండించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం, అమానుష హత్యలను మానివలసిందిగా సీపీఎం ఆహ్వానించింది.
గూఢచర్య ఆరోపణలపై అదుపులో ఉన్న హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూఏఈలోని వెగో అనే ట్రావెల్ ఏజెన్సీ స్పాన్సర్గా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. వేగో సంస్థకు పాక్లో కార్యకలాపాల లైసెన్స్ ఉన్నప్పటికీ, నిధుల సమకూర్పుపై ఇప్పటివరకు ఎలాంటి నిబంధనలు కనిపించలేదు
ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో విమానం ప్రతీకూల వాతావరణ కారణంగా శ్రీనగర్లో అత్యవసర ల్యాండింగ్ నిర్వహించాల్సి వచ్చింది. పాక్ గగనతలంలోకి మారాలని పైలట్ చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది.
పన్నెండేళ్ల దళిత బాలికపై ఐదుగురు బాలురు తాము చదువుకుంటున్న పాఠశాలలోని ప్రిన్సిపల్ గదిలో సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ఘోరాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించారు.
ఆపరేషన్ సిందూర్ విజయానికి అగ్నిపథ్ ద్వారా చేరిన అగ్నివీరులు కీలక పాత్ర పోషించారు. వాళ్లు పాక్ దాడులను అడ్డుకుని, మన సైనిక స్థావరాలను రక్షించడంలో ప్రతిభ కనబర్చారు.
తమిళనాడు టాస్మాక్పై ఈడీ చర్యలు రాజ్యాంగ సమాఖ్య స్వరూపాన్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. నీట్ పీజీ సీట్ల బ్లాకింగ్ వల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ, దానికి చెక్ పెట్టేందుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికంగా జరిగిందని, మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ నుంచే కాల్పుల విరమణకు సూచన వచ్చిందని, భారత్ తన డీజీఎంవో ద్వారానే స్పందించిందని తెలిపారు.
సద్గురు అభివృద్ధి చేసిన సంయమ సాధన ధ్యానంతో మెదడు వృద్ధాప్యం తగ్గుతుందని హార్వర్డ్ పరిశోధనలో వెల్లడైంది. 8 రోజుల ఈ ధ్యానంతో మెదడు వయసు 5.9 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో చైనా జే-35ఏ యుద్ధ విమానాలను పాకిస్థాన్కు సగం ధరకే ఇవ్వనుందని సమాచారం. పాక్ సాయంతో ఆయుధాల మార్కెట్లో తన స్థానాన్ని బలపరచాలనే వ్యూహంతో చైనా ఈ ఆఫర్ ఇచ్చినట్టు నిపుణుల అభిప్రాయం.