'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో శుక్రవారంనాడు రోడ్షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్గానో, స్టార్గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.
తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఓ చోట ఆన్స్ర్ షీట్ చూపించలేదనే కారణంతో విద్యార్థిపై తోటి స్నేహితులు దాడికి దిగారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలో మార్చి 26న జరిగింది.
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విజయం కోసం అభ్యర్థులు చిత్ర విచిత్రమైన పనులు అన్నీ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ( Lok sabha Elections ) ప్రకటన వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.
భారత ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరుకుందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్(Congress) నేత పి.చిదంబరం(P.Chidambaram) ఆరోపించారు. బీజేపీ వైద్యులు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి చికిత్స చేయట్లేదని విమర్శించారు.
ఒకప్పుడు ఉత్తర్ప్రదేశ్ను శాసించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెల్చుకుంటే ఢిల్లీలో అధికారానికి దగ్గరవ్వచ్చు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ (BJP) యూపీలో అధిక సీట్లు గెల్చుకోవడంతో ఆ పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది.
లోక్ సభ ఎన్నికలకు ఈసీ(EC) సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది. అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికలు వివిధ దశల్లో ఏప్రిల్ 19 నుంచి జరగనుండగా.. ఎన్నికల యుద్ధంలో గెలవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తదితర పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఎన్నికల గుర్తులెలా కేటాయిస్తారో తెలుసా..
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయం పన్ను అంశంలో ఆ పార్టీకి ఆదాయం పన్ను విభాగం శుక్రవారం నోటీసులు పంపింది. 2017-18, 2021-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1,823 కోట్ల మేర పన్ను నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఇండియా' కూటమి భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య బీహార్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఖరారైంది. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్కు 9 సీట్లను ఇవ్వాలని ఆర్జేడీ నిర్ణయించింది. పూర్ణియా నియోజవర్గంతో సహా 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున 'కేజ్రీవాల్ కో ఆశీర్వాద్' ప్రచారానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధాన అంశం సాంకేతికత కాగా దీంతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలు కూడా ఈ చర్చలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. అయితే వీడియోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మేరకు మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar)కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
నీలగిరి రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ.రాజా(A. Raja) రూ.21.61 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కలిగి ఉన్నారు. ఈ మేరకు తన నామినేషన్లో అఫిడవిట్ను సమర్పించారు.
ఎన్నికల ప్రచారం కోసం మదురైకి వెళుతున్న డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) వాకింగ్ కోసం అక్కడి పార్కులో శరవేగంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
రామనాథపురంలో ఎన్నికల కోడ్ ఉల్లఘించారంటూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం(Former Chief Minister O. Panneerselvam)పై కేసు నమోదు చేసినట్లు కేనికరై పోలీసులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్ - నాగర్కోయిల్ మధ్య వందే భారత్ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఏప్రిల్ 4వ తేదీన కన్నియాకుమారిలో పర్యటించనున్నారు. ఈస్థానం నుంచి బీజేపీ(BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్ రాధాకృష్ణన్కు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
: న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర జరుగుతున్నదని పలువురు న్యాయవాదులు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో న్యాయ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నాలుగురోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తమిళనాడు ఈరోడ్ ఎండీఎంకే లోక్సభ సభ్యుడు గణేషమూర్తి గురువారం వేకువజామున మృతి చెందారు. గత లోక్సభ ఎన్నికల్లో ఎండీఎంకే కోశాధికారిగా ఉన్న గణేషమూర్తి
రాజకీయాల్లో ఆమ్ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనే కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం విధానం కేసులో వంద కోట్లు చేతులు మారాయన్న ఈడీ ఆరోపణ కూడా అబద్ధమన్నారు. నిజమైతే వంద కోట్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.