‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారుల ప్రాణాలు కోల్పోయిన కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
దేశంలోని పురపాలికల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన వ్యర్థాలను (లెగసీ వేస్ట్) జాతీయ రహదారుల నిర్మాణంలో వినియోగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబరు 27న తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
దుకాణాల్లో ఏమైనా కొన్న తర్వాత చేత్తో ఫోన్ తీసి, పాస్వర్డ్ టైప్ చేసి, పేమెంట్ చేయడం కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటోందా.. ఈ ఇబ్బంది తొలగించడానికి ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ ‘మ్యూజ్’.. ‘రింగ్వన్’ అనే కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
అబ్బా ఈ రూట్లో రెడ్ సిగ్నల్స్ ఎక్కువగా ఉన్నాయి.. ముందే తెలిస్తే వేరే మార్గంలో వెళ్లేవాళ్లమే అని చాలా సార్లు అనిపిస్తుంది కదా..! ఇలా బాధపడేవారికి ఉపయోగపడేలా మ్యాప్ మై ఇండియా సహకారంతో బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్, ఆర్కాడిస్ ఇండియా సంస్థలు సంయుక్తంగా మ్యాపిల్స్ అనే యాప్ను తయారు చేశాయి.
కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలను దత్తత తీసుకోవాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్ణయించినట్లు పార్టీ ఎన్నికల నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున వెల్లడించారు. తొక్కిసలాట కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
సీట్ల పంపకంపై ఎన్డీయే కూటమిలోని భాజపా, జేడీయూల మధ్య ఒప్పందం కొలిక్కివచ్చినా కొన్ని నియోజకవర్గాలను అటూఇటూ మార్చుకోవడంపై చర్చలు మొదలయ్యాయి. చిన్న పార్టీలకు అనుకూలంగా కొన్ని స్థానాలను ఇచ్చేందుకూ అవి సన్నద్ధం అవుతున్నాయి.
హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన హర్వీందర్ సింగ్.. తాత కోరిక మేరకు క్రీడా మైదానం నుంచి వ్యవసాయ క్షేత్రానికి వచ్చి సిరులు పండిస్తున్నారు. ఇప్పుడాయన దేశంలోనే ఆలుగడ్డ విత్తనాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో నిలుస్తున్నారు.
ప్రఖ్యాత గాయకుడు జుబీన్ గర్గ్ మరణంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన చివరి క్షణాలకు సాక్షులుగా నిలిచిన నలుగురు అస్సామీ ప్రవాసులు విచారణలో భాగంగా సోమవారం పోలీసుల ముందు హాజరయ్యారని ఉన్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు.
టోల్ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లపై ఫిర్యాదు చేసే వాహనదారుల ఫాస్టాగ్ అకౌంట్లకు రూ.1,000 బహుమతి రూపంలో జమచేస్తామని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రకటించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్(52) ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపణలున్న హరియాణా డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్ర రూపందాల్చుతోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై 2017లో నమోదైన ఐఆర్సీటీసీ కుంభకోణం కేసుకు సంబంధించి దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సోమవారం అభియోగాలు నమోదు చేసింది.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో చేస్తున్న కృషికి మద్దతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 20 మందిని విడుదల చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2022లో నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా భారత సైన్యాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ లఖ్నవూ కోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విధించిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టు నవంబరు 20 వరకూ పొడిగించింది.
ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 1950లతో పోలిస్తే 67 శాతం తగ్గినప్పటికీ యువత మరణాల్లో ఆ స్థాయిలో తగ్గుదల లేదని ఓ అధ్యయనం పేర్కొంది. ఆత్మహత్యలు, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వినియోగమే ఇందుకు కారణాలని పేర్కొంది.
ఉత్తరాఖండ్ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)కి సంబంధించిన ఓ నిబంధనను సవరించాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు ఆధార్ కార్డు లేకపోయినా, ఇతర పత్రాలను ఉపయోగించి వివాహాన్ని నమోదు చేసుకోవచ్చు.
ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళ సెన్సర్ భూ పరిశీలన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు బెంగళూరుకు చెందిన గెలాక్స్ఐ అనే అంకుర సంస్థ సోమవారం తెలిపింది.
బిహార్ శాసనసభ ఎన్నికల తొలిదశలో పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్లు వేయడానికి మరో నాలుగురోజులే మిగిలి ఉన్న తరుణంలో ప్రధాన కూటములైన ఎన్డీయే, ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సింగూర్లో టాటా నానో కార్ల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది.
ఆధునిక చికిత్సారీతుల్ని అనుసరిస్తున్న ప్రభుత్వ అల్లోపతి డాక్టర్ల పదవీ విరమణ వయసు, ప్రభుత్వ అయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి(ఆయుష్) వైద్యశాలల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసుకన్నా భిన్నంగా ఉండాలా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును సోమవారం రిజర్వు చేసింది.
దేశంలో న్యాయాధికారులుగా చేరుతున్న వారిలో 60 శాతం మంది మహిళలేనని, వీరందరూ తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు పొందుతున్నారే తప్ప రిజర్వేషన్ల ద్వారా కాదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.