[21:02] పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన విమానాలు భారత గగనతలం వినియోగించకుండా కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు నేటితో ముగియనుండటంతో నిషేధాన్ని కేంద్రం పొడిగించింది.
[15:29] అందరి ముందు దొంగ అని ముద్ర వేయడంతో పురుగుల మందు తాగి ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్కతాలోని పశ్చిమ మేదినీపుర్లో చోటుచేసుకుంది.
[13:13] పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందని అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
[12:56] మే 23-24 తేదీల్లో భారత్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అండమాన్ నికోబార్ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు నోటమ్ జారీ చేశారు.
[05:14] పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో అంగీకరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(33)కు హిసార్ జిల్లా కోర్టు మరో నాలుగు రోజుల రిమాండ్ విధించింది.
[05:09] దక్షిణ కశ్మీరులోని పహల్గాం పట్టణం ఏప్రిల్ 22న పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి పర్యవసానాల నుంచి ఇంకా కోలుకోలేదు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకొన్న నాటి మారణకాండ తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పహల్గాంతోపాటు పరిసర గ్రామాల స్థానికులు జీవనోపాధిని కోల్పోయారు.
[05:13] ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్థాన్లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందని తేల్చి చెప్పారు.
[05:06] పహల్గాం ఘటన కంటే కొన్ని వారాల ముందే దిల్లీలో భారీ ఉగ్రదాడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నినట్లు తాజాగా బయటికొచ్చింది. నేపాల్ గూఢచారితో ఐఎస్ఐ పన్నిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్తో భగ్నం చేశాయి.
[05:07] తేనేటి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ దేశాలకు భారత్ తేనీటి విందు ఇచ్చింది. డార్జిలింగ్ టీ, మసాలా చాయ్, నీలగిరి, అస్సాం టీ లాంటి భారతీయ ప్రత్యేక టీ రకాలను ఆయా దేశాల ప్రతినిధులు రుచి చూశారు
[05:04] భారత్- నేపాల్ అంతర్జాతీయ సరిహద్దు గుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని వస్తున్న నిఘా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
[05:03] మహారాష్ట్రలోని ధులె పట్టణ ప్రభుత్వ అతిథిగృహం నుంచి పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకొన్న వ్యవహారంలో రాష్ట్ర శాసనమండలి ఛైర్పర్సన్ రామ్ శిందే ఓ ఉద్యోగిని గురువారం సస్పెండు చేశారు.
[05:02] వినియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
[05:00] వక్ఫ్ సవరణ చట్టం-2025ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మూడు అంశాలపై మధ్యంతర ఉపశమన ఉత్తర్వులకు సంబంధించి తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం గురువారం రిజర్వు చేసింది.
[04:59] యాంటీబయాటిక్లు ఎక్కువగా వాడటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా ఔషధ ప్రభావానికి లొంగని ‘సూపర్బగ్’గా మారి రోగికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంటుంది. ఈ ప్రమాదకర పరిస్థితికి పరిష్కారం చూపే కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.
[04:54] వినియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది.
[04:46] చేయాల్సిన పనులు చాలా ఉండి.. ముందుగా ఏది చేయాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే- ‘ఈ రోజు కేవలం ఒకే ఒక్క పని చేయగలిగే పరిస్థితి ఉంటే.. దేన్ని ఎంచుకుంటాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
[00:03] ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) నుంచి కీలక ప్రకటన వచ్చింది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో భాగంగా ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’ పేరుతో న్యూయార్క్లోని ప్రసిద్ధ ‘లింకన్ సెంటర్’లో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.