[07:44] ఉగ్రవాద సంస్థల చేతిలో ఈ-కామర్స్ వేదికలు, ఆన్లైన్ పేమెంట్ సర్వీసులు దుర్వినియోగం అవుతుండడంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
[04:45] కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు మంగళవారం పెద్దసంఖ్యలో రోడ్డెక్కి ప్రసన్నకుమార్రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
[04:42] జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. నీటివిలువ తెలిసినవాడిని. అందుకే జలహారతి ఇచ్చాను. నా జీవితంలో ఇది సంతోషకరమైన రోజు. వాస్తవానికి ఏపీలో ఇంకా వర్షాలు పూర్తిస్థాయిలో పడలేదు.
[04:35] భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో విధులు నిర్వర్తిస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.. మంగళవారం విద్యార్థులతో ముచ్చటించారు.
[04:30] రోడ్డుప్రమాదంలో గాయపడి కాలికి కట్టుతో మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడిన యశోదమ్మ అనే మహిళ పరిస్థితిని బెంగళూరు సమీప రామనగరలోని స్థానిక కోర్టు న్యాయమూర్తి అవినాశ్ చిందు అర్థం చేసుకున్నారు.
[04:32] భారత రాజ్యాంగమే అత్యుత్తమమైందని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ భావించారని, న్యాయ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం ఉండరాదని ఆయన కోరుకున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్నారు.
[04:26] నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ చర్యల్ని వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలకు చెందిన దాదాపు 25 కోట్లమంది కార్మికులు బుధవారం దేశవ్యాప్త సమ్మె చేయనున్నారు. దీంతో బ్యాంకింగ్, తపాలా సహా పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
[04:26] ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా ప్రసిద్ధి చెందిన ‘వత్సల’ (Vatsala) మంగళవారం తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లో ఇది మృతి చెందింది.
[04:25] అటవీ భూముల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, రహదారులు తదితర కనీస మౌలికవసతులు కల్పించడానికి వన్యప్రాణుల క్లియరెన్స్ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణశాఖకు గిరిజన వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
[04:24] మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నుంచి ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్కు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో విమానాన్ని ఇందౌర్కే మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 6.35 గంటల సమయంలో చోటుచేసుకుంది.
[04:24] ప్రస్తుత విద్యా సంవత్సరం(2025) నుంచి ప్రతిష్ఠాత్మక ఎరాస్మస్+ ఉపకార వేతనాన్ని 50 మంది మహిళలు సహా 101 మంది భారతీయ విద్యార్థులు పొందుతారని అధికారులు తెలిపారు.
[05:45] కాలం చెల్లిన, ఉపయోగించని కొన్ని ఔషధాలను చెత్తబుట్టల్లో, ఆరుబయట పడేయటం వల్ల అవి ప్రజలకు, జంతువులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) హెచ్చరించింది.
[04:21] బిహార్లో ఓటరు జాబితా ప్రక్షాళనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకమై చేస్తోన్న విమర్శలకు ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఈ కసరత్తు సరైన ఓటరు జాబితా తయారీలో భాగమేనని పేర్కొంది.
[04:20] రాష్ట్ర అసెంబ్లీలు సహా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించటానికి ముందుగానే ప్రతి సారీ ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది.
[04:19] విస్తృత శ్రేణి కలిగిన జలాంతర్గామి విధ్వంసక రాకెట్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. దీనివల్ల భారత నౌకాదళ ఆయుధపాటవం మరింత పెరుగుతుంది.
[04:18] ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ ఒక రఫేల్ యుద్ధవిమానాన్ని కోల్పోయిందని ఆ జెట్ల తయారీ సంస్థ దసో ఏవియేషన్ ఛైర్మన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. అధిక ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక వైఫల్యం కారణంగా రఫేల్ కూలిపోయిందని తెలిపారు.
[04:18] దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓ మూడు గ్రామాల ప్రజలు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వారు తొలిసారిగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోనున్నారు.
[20:15] ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) నిర్వహించాలన్న ఎన్నికల సంఘం (Election Commission of India) నిర్ణయం బిహార్ రాజకీయ వర్గాల్లో కాకరేపుతోంది.
[17:13] పాకిస్థాన్కు గూఢచార్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు రాష్ట్ర పర్యాటకశాఖ స్పాన్సర్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి స్పందించారు.
[16:59] కర్ణాటకలో సీఎం మార్పు అంశం తీవ్ర చర్చనీయమవుతున్న నేపథ్యంలో డీకేకు అనుకూలంగా ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, ప్రజల మద్దతు ఆయనకే ఉందని చెప్పారు.
[13:27] సోషల్ మీడియాలో ఖలిస్థానీ, దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇతర ఏజెన్సీలతో కలిసి సరికొత్త వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
[12:43] Dogs Bark Saves Lives: ఒకవైపు కుంభవృష్టి కురుస్తుంటే.. మరోవైపు కుక్క అరుపు ఆ యజమానికి నిద్ర పట్టనివ్వలేదు. అదే కొన్ని ప్రాణాలను కాపాడేందుకు కారణమైంది.
[12:18] సోషల్ మీడియా రీల్ కోసం ఏడేళ్ల కుమార్తె ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా తల్లిదండ్రులు ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.