డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన మంతిన పైడిశెట్టి (33) ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
మండలంలోని కోనంకి గ్రామంలో షేక్ ఖాజావలి అనే వ్యక్తి ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ద్విచక్రవాహనాలు, ఒక సోడాబండి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం అర్ధ్దరాత్రి జరిగింది శుక్రవారం ఉదయం బాఽధితుని కుమారుడు షేక్ మస్తానవలి మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ రాజశేఖర్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఖాజావలి కోనంకిలో సోడాబండిని నడుపుకుంటూ వ్యవసాయసీజన్లో బళ్లారి వెళ్లి వ్యవసాయం చేస్తుంటారు. ఇటీవల బళ్లారి వెళుతూ సోడాబండిని, తన ద్విచక్రవాహనాన్ని ఇంటి వరండాలో ఉంచాడు.
పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్మరాజుపల్లె నుంచి సిమెంట్నగ ర్కు వెళ్లేదారిలో దారిదోపిడీ దొంగలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
ప్రస్తుత సమాజానికి అనుగుణంగా నూతన నైపుణాలను, టెక్నాలజీలను నేర్చుకోవడం ఎంతో అవసరమని సీనియర్ ట్రైనర్ మైక్రోసాఫ్ట్ బెంగళూర్ ఎ.మల్లిఖార్జున్ తెలిపారు.
‘బయట ఎండ ఎక్కువగా ఉంది. ఉక్క పోస్తుంది. ఏరియా హాస్పిటల్లో చల్లగా ఉంటుంది. కాసేపు పడుకుని రెస్ట్ తీసుకుందామనిపించింది. ఆ మందుబాబుకి.. ఇంకేముంది క్వార్టర్ మందు వేసి ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాజువాలిటీలో బెడ్పై పడుకొని మత్తు నిద్రలోకి జారుకున్నాడు. ఆసుపత్రి సిబ్బంది వచ్చి లేపడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈఘటన చీరాల ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వెలుగుచూసింది.
విద్యార్థులపై ప్రభుత్వానిది నిర్లక్ష్య ధోరణి అని, పెండింగ్లో ఉన్న రూ.7వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షి్పలు విడుదల చేయాలని ఏబీవీపీ కన్వీనర్ కళ్లెం సూర్యప్రకాశ్, చేవెళ్ల నగర కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం చేవెళ్లలోని కళాశాలల విద్యార్థులో కలిసి పెద్దసంఖ్యలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై దాదాపు గంట సేపు ధర్నా చేశారు
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం పులివెందులకు చెందిన లింగాల విజయకుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.
ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు.
ఆది రూ. 25 కోట్లకు పైగా విలువ చేసే భూమి. ఇంకే ముందు అక్రమార్కుల కన్ను దానిపై పడింది. అలయ భూమే కదా..అని యాచారంలోని తిరుమలేశుడి మాన్యాన్ని అక్రమించేద్దామని అక్రమార్కులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నాలుగు ఎకరాలకు పైగా కబ్జా చేసి కడీలు నాటారు. ఇంత తతంగ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లిన ‘మన్యం’ తహసీల్దార్లు త్వరలోనే సొంత జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే ఇదే సమయంలో కొందరు తహసీల్దార్లు పైరవీలు ప్రారంభించారు.
దేశానికి వెన్నెముకగా చెప్పే రైతులకు భూ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి తరాలు మారినా తలరాతలు మారకపోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ సమస్య ఎవరికి పట్టకపోవడంతో పరేషాన్ అవుతున్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు టీడీపీ కూటమి సర్కారు తీపి కబురు అందించింది. వారి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో కంటే మరింతగా రుణ సాయాన్ని పెంచింది.
దేశ రక్షణ కోసం ప్రాణాలు ఆర్పించిన వీర సైనికుల త్యాగాలు మరువలేమని కలెక్టర్ శ్యామ్ప్రసాద్ అన్నారు. బీజేపీ యువమోర్చా, మాజీ సైనికుల ఆధ్వర్యంలోశుక్రవారం కలెక్టర్ ప్రాంగణంలో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీలో తమ వాణి వినిపించారు. మన్యంలో ప్రధాన సమస్యలపై ప్రస్తావించారు. సాలూరు ఎమ్మెల్యే, స్ర్తీశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు.
బషీరాబాద్ పీహెచ్సీకి ఏట్టకేలకు మహర్దశ పట్టుకుంది. ఇకపై మండల ప్రజలకు స్థానికంగా ఆస్పత్రిలో మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి. వైద్యసేవలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగిన పీహెచ్సీని తెలంగాణ వైద్య విధానపరిషత్ పరిధిలోకి బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజనులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందజేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొత్తం 82.59 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటివరకు 28.69లక్షల మొక్కలు నాటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని, దీనివల్ల ప్రమాదాలు జరిగే సమయాల్లో ప్రాణా పాయం నుంచి కాపాడుకోవచ్చని మున్సిఫ్ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు.
భరతజాతి చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాల తో లిఖించిన కార్గిల్ యుద్ధ విజయం దేశం యావత్తు జరుపుకునే ఒక పండుగ ఈ విజయ దివస్ అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.శైలజ అన్నారు.
మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న తొలి సినిమా `కమిటీ కుర్రోళ్లు`. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేస్తుంది.
అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ ...
చాలా కాలంగా నీరు లేక వెలవెల బోయిన కాగ్నానదికి జలకళ సంతరించుకుంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. తాండూరు నియోజకవర్గానికి జీవనాధారమైన కాగ్నా నదిలోకి వర్షం నీరు చేరింది.
కీసరగుట్టలోని దుర్గామాత శుక్రవారం భక్తులకు శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఆలయ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ, ఈవో సుధాకర్రెడ్డి అధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాలానుగుణంగా జరిగే మార్పుల్లో క్రీడల్లోనూ మార్పులు రావా లని, తదను గుణంగా విద్యార్థుల కు తర్ఫీదు ఇవ్వాలని టెక్కలి ఉపవిద్యా శాఖాధికారి విలియమ్స్ అన్నారు.
స్థానిక మినీస్టేడియం సమీపంలో ఆదివారం సాఫ్ట్టెన్నీస్ జూనియర్ జట్ల ఎంపిక జరుగుతుందని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జి.అప్పన్న, జి.షణ్ముఖరావు తెలి పారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పార్టీ బడాస్థాయి నేతల నుంచి గ్రామస్థాయి చోటా నాయకుల వరకూ అక్రమాలకు పాల్పడ్డారు. వారి అక్రమాలకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు. గత ఐదేళ్లలో ‘నాడు-నేడు’ పేరిట రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రోచ్ రోడ్డు లేని గ్రామాలను గుర్తించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
మండలంలోని జగనన్న లేఔట్లలో మిగిలిపోయిన ఇంటి పట్టాల విక్రయాలు జోరుందుకున్నాయి. ఇంటి పట్టా ఉన్నా? లేకున్నా ఖాళీ స్థలం కనబడితే..చాలు అక్కడ వైసీపీ నేతలు ప్రత్యక్షమవుతున్నారు. ప్లాటు రేటు బట్టి ధర నిర్ణయించి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొన్ని పట్టాలకు గతంలో ఇక్కడ పని చేసి వెళ్లిపోయిన తహసీల్దార్ల వద్దకు వెళ్లి సంతకాలు చేయించుకుని ఆక్రమించు కుంటున్నారు. రాత్రికి రాత్రే పునాదులు వేసేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ...
పంటల బీమాతో రైతులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు నిండా మునిగారు. విపత్తులు, అతివృష్టి, అనావృష్టి ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. సీటు పొందిన విద్యార్థులు ఉదయం 7 గంటలకే క్యాంపస్కు చేరుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో రూ. కోట్ల విలువైన దేవుడి భూములు అక్రమణకు గురయ్యాయని ఎమ్మెల్యే గౌరుచరిత స్పష్టం చేశారు.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది.
‘ప్రజా సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా’నని నూతన జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జేసీ బాధ్యతలు స్వీకరించారు.
గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, పాపాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములకు పట్టాలిచ్చారు. చుక్కల భూములు ఎన్ని ఎకరాలు చక్కబెట్టారు. నిషేధిత జాబితా నుంచి ఎంత తొలగించారనే వివరాలను ఆరా తీసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. వైసీపీ పాలనలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నుంచే దోపిడీకి బీజం పడింది. నియోజకవర్గంలోని కంబదూరు, కళ్యాణదుర్గంలో పనిచేసిన తహసీల్దార్లపై అధికార పార్టీ నాయకులు ...
తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...
స్థానిక జీడి బ్రోకర్ సిందిరి శ్రీనివాస్ (ఎక్స్లెంట్ క్యాజూ సప్లయర్స్) గోదాముపై శుక్రవారం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (విజయనగరం) కె.వెంకటరమణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేశారు.
జిల్లా వైద్యారోగ్యశాఖలో ఎప్పుడో భర్తీచేసిన పోస్టులపై ఇప్పుడు విచారణలు జరుగుతుండటంతో ఆ శాఖ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. 2004 నుంచి ఇప్పటివరకు జరిగిన నియామకాలపై రాష్ట్రస్థాయి అఽధికారులు విచారణలు చేస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఎయిడెడ్ పాఠశాలల యాజమానులలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో పిల్లలు చేరకపోయినా ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తమ స్కూళ్లల్లో నమోదు చేసి వారికి హాజరు వేస్తూ మోసానికి పాల్పడుతున్నారు.
దక్షిణాది పొగాకు మార్కెట్లో అదే జోరు కొనసాగుతోంది. దాదాపు మూడు వారాల అనంతరం ఈ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో శుక్రవారం పొగాకు కొనుగోళ్లు పునఃప్రారంభం కాగా గతంలో ఉన్న డిమాండ్ కొనసాగింది.
కొందరు అక్రమార్కులు అధికారం ముసుగులో నిధులను అడ్డంగా దోచేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీల్లోని కొంతమంది సర్పంచ్లు, అధికారులు తాము చెప్పిందే రాజ్యాంగమన్న విధంగా వ్యవహరించారు. నిధులను ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేశారు. అందుకు సంబంధించిన రికార్డులు, రసీదులు సక్రమంగా లేనేలేవు. ముఖ్యంగా ఒంగోలు డివిజన్ పరిధిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. మేజర్ పంచాయతీలైన సింగరాయకొండ, ఉప్పుగుండూరు, దొడ్డవరంల గ్రామాల్లో లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన అధికారులు అవినీతికి పాల్పడిన ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తుండగా, సర్పంచ్లకు చెక్పవర్ రద్దుచేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో ట్రా ఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదా రుల కు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునా థ్ అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఎస్పీ ప్రారంభించా రు.
వసతి గృహాల విద్యార్థుల ఆరో గ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని వెనకబడిన తరగతు ల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.