[05:26]మండల-మకరవిలక్కు పూజ నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లో(సోమవారం, మంగళవారం)నే దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు శబరిమలకు విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
[05:32]శ్రీసత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
[05:30]దేశ వైమానిక పరిశ్రమల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో స్థలం కొరత, వ్యయాలు భారీగా పెరిగిపోవడం, రద్దీ లాంటి కారణాలతో విస్తరణ కష్టంగా మారిందని, ఇప్పుడు పెద్ద పరిశ్రమలన్నీ దానికి సమీపంలోని శ్రీసత్యసాయి జిల్లాపై దృష్టిపెడుతున్నాయని రేమండ్ గ్రూప్నకు చెందిన జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ ఎండీ గౌతమ్ మైనీ తెలిపారు.
[05:24]ఎర్రకోట సమీపాన కారుబాంబుతో దాడికి పాల్పడి మారణహోమం సృష్టించిన డాక్టర్ ఉమర్ నబీ.. ఆత్మాహుతి దాడులకు ప్రేరేపించేలా రూపొందించిన వీడియో సందేశం దర్యాప్తు అధికారులకు లభ్యమైంది.
[05:23]ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్ష పార్టీలను ధ్వంసం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కుటిల పన్నాగం పన్నిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
[05:22]తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు.
[05:21]ఓట్ల చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు.. ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండేలా చూడాలనుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నార
[05:20]బిహార్లో 20వ తేదీన ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పుపై ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన భాజపా, జేడీయూ మధ్య చర్చలు జరుగుతున్నాయి. స్పీకర్ పదవి విషయంలో రెండు పార్టీలూ పట్టుదలగా ఉన్నాయి.
[05:19]చట్టవిరుద్ధ కార్యకలాపాలను సమర్థించడం, వాటికి సహాయపడటం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయొద్దని దేశంలోని ప్రైవేటు టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ హెచ్చరిక జారీచేసింది.
[05:18]చాలాకాలంగా భద్రతా బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా ఉన్న హిడ్మాను పట్టుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల అధికారులకు స్పష్టమైన డెడ్లైన్ విధించినట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం బీసీ సమాజం కించపరిచే చర్యగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ (బీపీఎఫ్) డిమాండ్ చేసింది.
[05:17]వన్యప్రాణుల కారణంగా సంభవించే పంట నష్టానికి ఖరీఫ్ సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) కింద పరిహారం చెల్లించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు.
[05:16]దేశరాజధాని దిల్లీలో పేలుడు ఘటన మరవకముందే మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. పలు కోర్టులు, విద్యాసంస్థలు లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
[05:14]ఎన్ఐఏ, యూఏపీఏ, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) వంటి ప్రత్యేక చట్టాల కింద నమోదైన కేసుల్ని ఆరు నెలల్లో పరిష్కరించేందుకు దేశవ్యాప్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
[05:13]దేశ రాజధానిలో 2020లో జరిగిన అల్లర్లకు సంబంధించి నిర్బంధంలో ఉన్న జేఎన్యూ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్ తదితరులకు బెయిలు ఇవ్వొద్దని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును గట్టిగా కోరారు.
[05:13]సమాచార భద్రత కోసం ఎటువంటి వివరాల్లేకుండా కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్తోనే కొత్త ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) యోచిస్తోంది.
[05:12]వాతావరణ మార్పుల నిరోధానికి సవరించిన జాతీయ నిర్దేశిత లక్ష్యాలను(ఎన్డీసీ) డిసెంబరులో సమర్పిస్తామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం తెలిపారు.
[05:11]దేశంలో తొలి బుల్లెట్ రైలు 2027 ఆగస్టులో గుజరాత్లోని సూరత్-వాపి మధ్య నడుస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం రైల్భవన్లో విలేకరులకు తెలిపారు.
[05:10]మహారాష్ట్రలోని నాగ్పుర్ కేంద్ర కారాగారంలో శిక్షలు అనుభవిస్తున్న పదిమంది ఖైదీలు నాలుగు రోజులు శ్రమించి మినీ రాయ్గఢ్ కోటను నిర్మించారు. తాము గతంలో ఎప్పుడూ ఆ కోటను చూడకపోయినా ఇంటర్నెట్లోని ఫొటోల ఆధారంగా అచ్చు గుద్దినట్టుగా ప్రతిరూపాన్ని సృష్టించారు.
[05:05]ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు తాను చెత్త కిడ్నీని దానం చేశానని ఆరోపిస్తున్న వారితో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య స్పష్టం చేశారు.
[05:04]అధిక దిగుబడినివ్వడంతోపాటు వంటకాలకు మంచి రుచిని జోడించే ‘సాస్-కెవు’ అనే కొత్త అల్లం రకాన్ని నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
[04:59]మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్వాంటెడ్ మద్వి హిడ్మా (51) భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు.
[05:04]మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యాఖ్యలుచేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మరోసారి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆస్తులు జప్తుకు ఆదేశాల మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవో కా