కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షా లు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకూ
తమలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసి, ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. కుప్పంలో శుక్రవారం ఆమె ఎన్టీఆర్ ట్రస్టు తరఫున స్కిల్ డెవల్పమెంట్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో 31 కుట్టు మిషన్లు, 25 తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉక్కుపాదంతో కాకినాడలో రేషన్ మాఫియా వణుకుతోంది. గత ప్రభుత్వ సహకారంతో ఐదేళ్లపాటు యథేచ్ఛగా పేదల బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలించేసిన అక్రమా ర్కులు ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విలవిల్లా డుతున్నారు.
ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగులతో కూడిన కిట్లు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనిపై దృష్టి పెట్టారు. అన్నట్టుగానే ఇంటర్మీడియట్ విద్యా మండలి నిధులతో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలో పాటు అవసరమైన నోట్ పుస్తకాలు, బ్యాగులు అందించే యత్నం చేశారు. ఈ పుస్తకాలు, బ్యాగులు జిల్లా కేంద్రానికి.. అటు నుంచి మండలాలకు చేరాయి. వచ్చే వారంలో ఇంటర్ విద్యార్థులకు కిట్ల పంపిణీని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా క�
అధికారం అండగా చెలరేగిపోయారు. తమ ఎమ్మెల్యేలు, నేతలను చూసి శ్రేణులూ రెచ్చిపోయాయి. మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామంటూ కార్యకర్తలకు భ్రమలు కల్పించారు. నాయకులూ అదే భావనలో ఉన్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అరాచకం, విధ్వంసం సృష్టించారు. వీరి దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలతో విసిగిపోయిన జనం.. జిల్లాలో పుంగనూరు మినహా అన్నిచోట్లా ఘోరంగా ఓడించారు. అప్పటి వరకూ మేమున్నామంటూ శ్రేణులకు చెబుతూ వచ్చిన వైసీపీ అభ్యర్థులు.. ఘోర పరాజయం తర్వాత వెనుతిరిగారు. ఐదేళ్లు అధికారాన్ని అనుభవించి ఒక్క ఓటమితో కార్యకర్తల్ని గాలికొదిలేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అయోమయం, గందరగోళానికి గురవుతున్నారు.
వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం 2024-25 సంవత్సరంలో పొలంబడి జీఎపీ (గుడ్అగ్రికల్చర్ ప్రొడక్ట్స్) సర్టిఫికేషన్ ప్రొగ్రామ్పై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లాస్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొన్నారు.
మంథని మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల అధ్వానంగా మారింది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు ఆవరణ చెరువులా మారడం, స్కూల్కు వచ్చే రోడ్డు బురదమయంగా తయారవడంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్�
అఖండ గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండు మూడు రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉండవచ్చని అధికారులు చెబుతు న్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 13.60 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి 12,52,949 క్యూసెక్కుల నీరు సముద్రం లోకి పోతోంది.
నామినేటెడ్ పదవులకు సంబంధించిన 60:40 ఫార్ములా తిరుపతిలో కూటమి నేతలను కలవరపరుస్తోంది. ఈ ఫార్ములా వల్ల నియోజకవర్గంలో బలంగా ఉన్న టీడీపీ నాయకులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. జనసేన నేతల్లో సంబరం ఉన్నా, తమలో పదవులు దక్కేది ఎవరికనే కలవరం వారిలోనూ ఉంది. బీజేపీ కూడా తమ వాటా పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. పరిమిత సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవుల పందేరం మొత్తంమీద తిరుపతి నియోజకవర్గంలో కత్తిమీద సాముగా మారే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలో ప్రతిచోట పలువురు వైసీపీని వీడి కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావించలేక అణిగిమణిగి ఉన్న ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరసన గళం వినిపిస్తున్నారు.
సెర్చ్ఇంజిన్లలో గూగుల్ గుత్తాధిపత్యానికి పెను సవాల్ ఎదురైంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బాట్ సేవలను అందిస్తున్న చాట్జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ సవాల్ను విసిరింది. ‘సెర్చ్జీపీటీ’ ప�
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తిరుపతి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి అమరావతి నుంచి నూతన ఇసుక పంపిణీపై భూగర్భ గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకే్షకుమార్ మీనా వర్చువల్ విధానంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
రాజమండ్రి లో 2.20 కోట్ల రూపాయలతో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు . తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో హెచ్ డీ ఎప్ సీ బ్యాంక్ సొమ్ము తో పరారైన వాసంశెట్టి అశోక్ కుమార్ అనే నిందితుడు .
: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలు ఇచ్చారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కంప్యూటర్ల కొనుగోల్మాల్ వ్యవహారాలపై అధికారులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గోల్మాల్ వ్యవహారంపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్త పాలన.. అక్కరకు రాని పంట నష్టపరిహారం.. అడ్డదిడ్డంగా ప్రధాన కాల్వలు, డ్రెయిన్లు.. తీవ్రమైన సాగు, తాగునీటి ఎద్దడి.. పట్టించుకునేవారు లేరు. పరిష్కరించే నాథుడు రాడు. దీంతో ఐదేళ్ల తర్వాత కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా జరిగే జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి పడింది. చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సమగ్రంగా చర్చించి, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఐదేళ్ల తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకుండా జరిగే సమావేశం కూడా ఇదే కావడం విశేషం. - ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం
సమతా సైనిక్ దళ్(ఎ్సఎ్సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్ చేస్తున్నారంటూ డీఎంహెచ్వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు.
ఆ సీటంటే తహసీల్దార్లకు భలే స్వీటు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో సొంత జిల్లాలకు వస్తున్నవారు దీనిపై కన్నేశారు. ఇంతకీ ఎక్కడుంది ఈ సీటు? ఏమా స్వీటు కథ? అనుకుంటున్నారా? అయితే విజయవాడ రూరల్ మండలానికి వెళ్లాల్సిందే.
పెడన నియోజకవర్గంలో ఇంకా జోగి రమేశ్ హవా కొనసాగుతోందా? నియోజకవర్గంలో ఆయన చేసిన భూదందాలు, అసైన్డ్, ప్రభుత్వ భూముల స్వాధీనంలో జరిగిన అక్రమాలు బయటపడకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారా? పెడన నుంచి పెనమలూరు వెళ్లినా, ఆయనకు గుట్టుచప్పుడు కాకుండా సహకరిస్తున్న కీలక వ్యక్తులు, అధికారులు ఎవరు? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఐదేళ్లుగా జోగి రమేశ్ చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకు, తనకు అనుకూలంగా ఉండే తహసీల్దార్లను కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
దుర్గగుడిలో వారిద్దరి స్టైలే వేరు. ఎన్ని బదిలీలైనా, ఎన్ని రోజులైనా కాసులు కురిపించే కీలక స్థానాలను మాత్రం వారు వదలరంటే వదలరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా, విజిలెన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వారిద్దరినీ పక్కన పెట్టేవారే ఉండరు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని పోస్టులను ఏరికోరుకుని మరీ ఎంచుకుని కూర్చుంటారు. వీరిలో ఒకరి ఉద్యోగ నియామకంలోనే వివాదాలున్నా.. మరొకరిని ఏసీబీ కేసులు వెంటాడుతున్నా.. తాజాగా జరిగిన దుర్గగుడి అంతర్గత బదిలీల్లో ప్రాధాన్యమైన పోస్టులు కల్పించడం వెనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. - విజయవాడ, ఆంధ్రజ్యోతి
తిరుపతికి చెందిన వ్యాపారి కిడ్నాప్ కథ చివరకు సుఖాంతమైంది.చిన్నగొట్టిగల్లు మండలం చెరువు ముందరపల్లెకు చెందిన భాస్కర కొన్ని సంవత్సరాలుగా తిరుపతిలోని మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న ఈయన ఆటో కూడా నడుపుతుంటాడు.సొంత పనుల నిమిత్తం బుధవారం స్వగ్రామానికి వచ్చి తిరిగి తిరుపతికి వెళుతూ మార్గమధ్యంలోని చిన్నగొట్టిగల్లు వద్ద కిడ్నాప్ అయ్యాడు
కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీపీఎం ఆరోపించింది. అన్యాయంపై పోరాడేం దుకు టీడీపీ ముందుకు రావాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
మహానాడు జం క్షన్ నుంచి నిడమానూరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణ పను లు త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కోరారు.
హైదరాబాద్లో మహంకాళి జాతర సందర్భంగా ఉమ్మడి ఆల యాల్లో అమ్మవార్లకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు శుక్రవారం ఆషాఢ సారె, పట్టువస్త్రాలు సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో మార్పులు జరిగాయి. శుక్రవారం పురపాలికలకు సంబంధించి జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లకు స్థా
సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహుదుర్పురా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగ
నాడు అనారోగ్యంతో తండ్రి.. నేడు ప్రమాదవశాత్తు తల్లి మృతి చెందగా, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం తల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, స్థానికులు అందించిన విరాళ�
[01:09]ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది.
[01:07]‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’.
జిల్లా ఫైలేరియా విభాగంలో పనిచేస్తున్న సీని యర్ అసిస్టెంట్ కె.రాథాకృష్ణ కనిపించకపోవడానికి ఎఫ్ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ వేధింపులే కారణమని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నా మని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఆర్ పవన్కుమార్ స్పష్టం చేశారు.
లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అదనపు కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో వైద్యఉద్యోగి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో రూ.7లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దొంగలు అపహరించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ చోరీ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు.
[01:00]ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది.
ప్రస్తుత వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరదల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, అనవసరంగా బయట తిరగవద్దని పీవో సూచించారు.
అల్పపీడనం, వాయుగుండం వర్షాలతో మండలంలో ఖరీఫ్ వరి నాట్లు ప్రారంభమయ్యాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్లో 2,025 హెక్టార్లలో వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. వరినారు సిద్ధంగా ఉండడంతో గ్రామాలలో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని మేడివాడ, రావికమతం, పెద్దిరాజు, మత్స్యపురం, గుమ్మాళ్లపాడుల్లోని చెరువుల్లో తాజాగా కురుస్తున్న వర్షాలకు పుష్కలంగా నీరు చేరింది. ఈ వర్షాలకు రైతులు దమ్ములు ప్రారంభించి వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది కల్యాణపులోవ రిజర్వాయర్ నీటిని ఆగస్టు ఐదున ఆయకట్టు భూములకు విడుదల చేసేవారు. అయితే ఈ ఏడాది వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదలకు ముందుగానే దమ్ములు పట్టి, వరి నాట్లు ప్రారంభించేశారు.
Paris Olympics 2024 Opening Ceremony : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తన ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ప్రారంభ వేడుకలో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ క్రీడల నుండి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో భారతదేశ పతాకధారులుగా మారిన మొదటి క్రీడాకారులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులు పైబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు గిరిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచాయి. అధిక సంఖ్యలో గిరిజనులు ఇళ్లకే పరిమతమయ్యారు. ఏజెన్సీలో వారపు సంతలు జరగకపోవడంతో గిరిజనులు నిత్యావసర సరకులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈదురుగాలులకు చెట్లు పడిపోతుండడంతో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం ఏర్పడుతున్నది.
జిల్లాను ముసురు వీడడం లేదు. శుక్రవారం సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కొనసాగింది. దీంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నది. తాజా పరిస్థితి చూస్తే వర్షం తగ్గే సూచనలు ఏ మాత్రం కన్పించకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో గెడ్డలు, వాగులు ఉధృతంగానే పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రం మొదలుకుని అన్ని మండలాల్లో గెడ్డలు, వాగుల పరిస్థితి అలానే ఉంది, జిల్లాలోని వరద ప్రభావం అధికంగా ఉన్న చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.జే.అభిషేక్ వరద సహాయక, పునరావస చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
వ్యాపార అవసరాల పేరుతో రైతులు, వ్యాపారుల నుంచి సుమారు రూ.150 కోట్లు వసూలు చేసిన చింతపండు వ్యాపారి (కమీషన్ ఏజెంట్) పరారయ్యాడు. కమీషన్ ఏజెంట్ చేసిన మోసంతో ఆవేదనకు గురైన ఓ వ్యాపారి బెంగతో మృతి చెందాడు.
మండలంలోని బొయితిలి పంచాయతీ రాసవీధి, కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ టీడబ్ల్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ‘భారీ వర్షాలతో కల్వర్టులకు గండి’ శీర్షిక శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై పీవో స్పందించారు. గండి పడిన కల్వర్టులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అండంగిసింగి కాజ్వేపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద ఆక్రమణలపై సచివాలయ సిబ్బందిపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆక్రమణలపై మునిసిపల్ కమిషనర్ రవిబాబుకు చాల ఫిర్యాదులు అందడంతో టీపీవో శుక్రవారం మినీ స్టేడియం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయ్యప్పస్వామి గుడి పక్కన స్టేడియం స్థలం ఆక్రమించి పూజా సామగ్రి దుకాణం భారీగా ఏర్పాటు చేయడంపై సంబంధిత వ్యక్తిని నిలదీశారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసి సాయంత్రంలోగా ఆక్రమణ తొలగించాలని సచివాలయ సిబ్బందికి టీపీవో ఆదేశాలు జారీ చేశారు. స్టేడియం ముందు మెయిన్ రోడ్డుని ఆనుకొని మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండేది.