ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
[04:55]చలి తీవ్రతతో తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
[04:53]జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భాజపాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పోటాపోటీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో పార్టీ 17,061 ఓట్లకే పరిమితమైంది. డిపాజిట్ కూడా కోల్పోయింది.
[04:55]రాష్ట్రంలో పత్తి సాగుపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జిల్లాల వారీగా సగటు దిగుబడిపై వెంటనే నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కలెక్టర్లను ఆదేశించింది.
[04:54]మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు రైలు కింది నుంచి వెళ్లే క్రమంలో.. ఒక్కసారిగా అది కదలడంతో ఓ ప్రయాణికుడు పట్టాల మధ్యలో పడుకొని తన ప్రాణాలను కాపాడుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
[04:52]తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపాన శిక్షణ విమానం కూలిపోయింది. ఎయిర్ఫోర్స్కు చెందిన పిలాటస్ పీసీ 7 చిన్న విమానం శుక్రవారం తాంబరం వైమానిక దళ స్థావరం నుంచి బయల్దేరింది.
రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శా�
[04:51]ఎన్నికల్లో వరుసగా ఓటములు భారత రాష్ట్ర సమితిను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత నుంచి పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
[04:50]రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ అన్నారు.
[04:48]గ్రామాలు, పట్టణాల నుంచి బస్సులు కావాలంటూ ఆర్టీసీకి భారీగా వినతులు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కూడా ఉన్నాయి.
[04:47]ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తులకు వినియోగిస్తున్న తీపి జొన్న, సజ్జ పంటలను రైతులు భారీ ఎత్తున సాగు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) సంచాలకురాలు తారాసత్యవతి సూచించారు.
తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60 ఉద్యోగాలకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్ల�
తెలంగాణ ఆర్టీసీలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 8 నుంచి 28వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల గడువు ముగిసి 20 రోజులు కావొస్తున్నా ఎంతమంది దరఖాస్తు చేశారనే విషయాన�
హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియాకు చెందిన సీబీ1000 హార్నెట్ ఎస్పీ మోటర్సైకిల్ను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ బైకులో విడిభాగాల్లో సమస్య తలెత్తడంతో వెనక్కి పిలిపిస్తున్నట్టు సంస్థ �
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్లీ నష్టాల్లోకి జారుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.1.21 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఆదాయం తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో గండిపడిందని ప
ప్రముఖ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.517.9 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏ
[04:27]బిహార్ ఎన్నికల్లో గెలవబోయేది ఎన్డీయే అని దాదాపు ఎగ్జిట్పోల్స్ అన్నీ ఈసారి కచ్చితంగానే అంచనా వేసినా ఏ కూటమికి ఎన్ని రావచ్చనే విషయంలో మాత్రం లెక్క తప్పాయి.
విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ నెల 7తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.699 బిలియన్ డాలర్లు తరిగిపోయి 687. 034 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వుబ్యాంక్ తాజా సమీక్షలో వెల్లడించి
అన్ని దవాఖానలు, బీమా సంస్థలు వైద్య ప్రమాణాలను మెరుగుపర్చాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. దేశంలోని ప్రముఖ దవాఖానలు, ప్రధాన బీమా సంస్థల ప్రతినిధులతోపాటు, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, భారతీయ
[04:23]అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు గాను బీబీసీ గురువారం ఆయనకు క్షమాపణలు చెప్పింది.
[04:23]ప్రయాణ పత్రాల సమస్య కారణంగా 150 మందికి పైగా పాలస్తీనియన్లు ఉన్న విమానాన్ని 12 గంటలపాటు దక్షిణాఫ్రికాలో నిలిపివేయడంతో అక్కడి అధికారులు శుక్రవారం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
[04:22]జమ్మూకశ్మీర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి ఇటీవల స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా భారీ విస్పోటనం చోటుచేసుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, టెలికాం రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు కోలుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మ�
[04:17]కలలు కనేవారిదే చరిత్ర అనే నానుడి ఉంది. దానిని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ మార్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు కలలనేవి చరిత్రగా మిగిలిపోయాయి.
[04:15]బిహార్ ప్రజలు ఎన్డీయేకు ప్రచండ విజయం అందించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిర్ ఏక్ బార్.. ఎన్డీయే సర్కార్ అంటూ నినదిస్తూ మరోసారి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు.
[04:13]ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే).. సొంత రాష్ట్రమైన బిహార్లో మాత్రం తొలి ప్రయత్నంలోనే ఘోర పరాభావాన్ని చవిచూశారు.
[04:12]బిహార్ శాసనసభ ఎన్నికల్లో అయిదేళ్ల కిందట ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ - రామ్ విలాస్) తాజా ఫలితాల్లో 19 స్థానాల్లో విజయంతో సత్తా చాటింది.
[04:10]సర్వే సంస్థల అంచనాలను మించి బిహార్లో జైత్ర యాత్రను కొనసాగించిన ఉత్సాహంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే...త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో సమరనాదాన్ని మోగించనుంది.
[04:06]నీతీశ్ కుమార్ పనైపోయింది.. ఆయన ఓ పల్టూరామ్.. అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారు.. అనే విమర్శలను పటాపంచలు చేస్తూ బిహార్ ఓటర్లు తీర్పు ఇచ్చారు.
[04:08]ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.. నిరుద్యోగులు నమ్మలేదు.. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.. ఉద్యోగులు విశ్వసించలేదు.. మహిళలకు నెలనెలా రూ.2,500 చొప్పున ఇస్తామన్నారు.. అతివల చెవిన పడలేదు.
[04:04]బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో రెండో అతిపెద్ద దెబ్బ. కూటమి భాగస్వామిగా 61 స్థానాల్లో బరిలోదిగిన పార్టీ కేవలం ఆరుచోట్ల గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
[04:03]గుజరాత్ హైకోర్టులో విచిత్ర విడాకుల కేసు దాఖలైంది. భార్య (40)తరచూ ఇంటికి వీధి శునకాలను తీసుకువస్తోందని, ఎంత వారించినా తన మాట పట్టించుకోవడం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి (41)హైకోర్టు తలుపు తట్టాడు.
[04:00]దేశ రాజధాని దిల్లీలో కారు బాంబు పేలుడు నేపథ్యంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వైద్యులు ముజఫర్ అహ్మద్, ఆదిల్ అహ్మద్ రాథర్, ముజమ్మిల్ షకీల్, షాహీన్ సయీద్లను జాతీయ వైద్య రిజిస్టర్ నుంచి తొలగించారు.
[03:58]దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడుకు కారణమైన కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి.