[05:24]‘బాల్యంలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుకునే రోజుల్లో సీజేఐ అవుతానని ఎన్నడూ అనుకోలేదు. న్యాయ వ్యవస్థ అంటే ఏంటి.. అందులో న్యాయమూర్తి భూమిక ఎలా ఉంటుందన్నది ఆ రోజుల్లో తెలిసేది కాదు’..
[05:26]‘‘రాయలసీమ రైతులకు మరింత ఆదాయం పెరగాలంటే ఉద్యాన పంటల సాగును మరింత విస్తృతం చేయాలి. సీమలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవసరమైన అన్ని వనరులూ ఉన్నాయి. ఇప్పటికే అనేక పరిశ్రమలు, కంపెనీలను ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయిస్తోంది. దీనికి తోడు పండ్ల ఎగుమతుల ద్వారా చక్కని ఆదాయం పొందొచ్చు’’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
[05:25]రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాయు, జల కాలుష్యంతోపాటు పారిశ్రామిక, బయో వ్యర్థాలపై సమగ్రంగా అధ్యయనం జరపాలని నిర్దేశించారు.
[05:24]సుపరిపాలన అంశంపై వచ్చే నెలలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో కార్యశాల నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అధికారుల్లోనూ పాలనాసామర్థ్యాలు పెరిగేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
[05:23]దేశంలో రాజకీయ పార్టీలకు రూ.2వేల లోపు విరాళాలను అందజేసే వ్యక్తుల పేర్లు, వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించిన ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
[05:22]విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల అరెస్టయిన మావోయిస్టుల్లో ముఖ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పోలీసులు విజయవాడలోని వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
[05:21]‘రాజధాని అమరావతిలో ఎసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై 2020లో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మీరు ఫిర్యాదుదారు కాదు. బాధితుడూ కాదు.
[05:20]దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. కాబుల్ నుంచి వస్తున్న అఫ్గానిస్థాన్కు చెందిన అరియానా ఎయిర్లైన్స్ విమానం పొరపాటున టేకాఫ్లకు పరిమితమైన రన్వేపై దిగింది.
[05:20]నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రానికి ప్రవాస భారతీయురాలు భారీ విరాళాన్ని ప్రకటించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా రూ.10.50 కోట్లతో నందీశ్వర సదనం నిర్మిస్తున్నారు.
[05:19]కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామపాద పుష్కర్ ఘాట్లో సోమవారం కృష్ణా నదికి మహావస్త్రం సమర్పించారు. ముందుగా నాగాయలంక కూడలి నుంచి మేళతాళాలతో.. 504 చీరలను ముడులు వేసిన మహావస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు.
గౌరవెల్లి సహా తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ త్వరితగతిన అనుమతులివ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి తన్మయికుమార్ను కోరారు.
[05:18]హింస, వేధింపులు లేదా ఏ రూపంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) 24 గంటలూ అందుబాటులో ఉండే కొత్త హెల్ప్లైన్ నంబర్-14490ను ప్రారంభించింది.
[05:16]పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణపై గగ్గోలు రేకెత్తుతున్న వేళ.. మాయారాణి గోస్వామి అనే మహిళా ఓటరు పేరు 44 నియోజకవర్గాల్లో నమోదైనట్లు బయటపడింది.
[05:15]హైస్కూల్ విద్య కోసం తన ఊరి విద్యార్థులు నాలుగైదు కి.మీ. దూరం వెళ్లాల్సిన దుస్థితిని తప్పించేందుకు రూ.2 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఓ వ్యక్తి ఉదారంగా ఇచ్చేశారు.
[05:15]ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాముపై మరో కేసు నమోదు కానుంది.
[05:14]దేశంలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్)లో ఇప్పటివరకు 99% మేర దరఖాస్తుల పంపిణీ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.
[05:13]ప్రతీకారంతోనో, అత్యాశతోనో కాకుండా ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాలని పాండవులకు శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన విధంగానే ఆపరేషన్ సిందూర్ను చేపట్టామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు.
[05:12]హరియాణాలోని మోర్నీ ప్రాంతానికి చెందిన ఓ రైతు ఔషధ గుణాలు ఉన్న పుట్టగొడుగుల సాగులో లాభాలు ఆర్జిస్తున్నారు. బడియాల్ గ్రామానికి చెందిన వీరేంద్ర బజ్వాన్.. గనోడెర్మా పుట్టగొడుగును శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.
[05:13]నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతిని పదవి నుంచి తొలగించి, కొత్త మేయర్ను ఎన్నుకోవాలని 40 మంది కార్పొరేటర్లు జేసీ మొగిలి వెంకటేశ్వర్లును కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చారు.
విద్యుత్తు సంస్థలు ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున కరెంట్ను కొనుగోళ్లు చేయనున్నాయి. అధికారిక సమాచారం మేరకు ఐదువేల మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి.
[05:12]ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడిని పిట్బుల్ జాతి కుక్క తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడి చెవి తెగిపడేందుకు కారణమైన ఈ సంఘటన దిల్లీలోని ప్రేమ్నగర్ ప్రాంతంలో ఆదివారం జరిగింది.
[05:11]మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇతరులను ఇరికించేందుకు ఆయన కుమార్తె సునీతారెడ్డి ప్రయత్నిస్తున్నారని అవినాష్రెడ్డి తదితరుల తరఫు న్యాయవాది సోమవారం సీబీఐ కోర్టుకు నివేదించారు.
[05:10]లేబర్ కోడ్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం శ్రామికవర్గంపై దాడి చేయడమేనని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు.
ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్న మహిళలకు ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇవ్వాలని ఐఎన్టీయూసీ నేతలు సూచించారు. సర్వీసులో ఉన్న కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.
[05:04]సైబర్ మోసాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు (మొబైల్ నంబరు) అయినా దుర్వినియోగం అయితే.. ఆ సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులవుతారని టెలికాం విభాగం (డాట్) సోమవారం స్పష్టం చేసింది.
[05:10]అప్పటి వరకూ అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తితో విభేదాలు తలెత్తగానే అత్యాచార ఆరోపణలు చేయడం, నిందితుడిగా పేర్కొంటూ శిక్షించాలనే ధోరణి అధికమవుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
[05:09]నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు, దిల్లీ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో దిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
[05:08]ఇప్పటివరకూ మీరు కొనసాగించిన అలవాట్లే ప్రస్తుత మీ జీవితానికి కారణం. ఇంతకన్నా మెరుగైన స్థితికి చేరుకోవాలంటే, కొత్తగా ఏయే అలవాట్లు అలవర్చుకోవాలో తెలుసుకోండి.
[05:00]ఎంతో అట్టహాసంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) కథ కంచికి చేరింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�
[04:59]ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్రణాళికలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తున్న ఐరోపా యూనియన్ (ఈయూ)... 28 పాయింట్లతో ఓ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది.
[04:58]దక్షిణ కొరియాలో ఆన్లైన్లో లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడిన 33 ఏళ్ల వ్యక్తికి జిల్లా కోర్టు ఒకటి సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
[04:48]గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు.
[04:48]ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
[04:47]‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.