కిష్టంపేట వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ను తక్షణమే ఎత్తివేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగు నూరి వెంకటేశ్వర్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం వై జంక్షన్ వద్ద రా స్తారోకో నిర్వహించారు.
ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మూడు పద్ధతుల్లో వేరు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం నగరంలోని 12వ డివిజన్ భగత్నగర్లో పర్యటించారు. పలు కాలనీల్లో పాదయాత్రగా పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు.
జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16వేలు ధర కల్పించి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని ఏపీ రైతు సం ఘం జిల్లా కార్యదర్శి మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ అజయ్కుమార్ కోరారు.
పేద ప్రజల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని, అందుకోసమే ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని టీడీపీ వైపాపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. ఎర్రగొండపాలెంలో బుధవారం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల, ఉద్యోగుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సెయింట్జార్జ్ పాఠశాలలో జరుగుతున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, వీణవంక మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడమే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
అర్ధవీడు మండలంలోని యాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నాగులవరం, కాకర్ల విలేజి హెల్త్ క్లినిక్లను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తని ఖీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతిలో ‘పల్లె వైద్యం.. పేదలకు దూరం’ అనే శీర్షిక వచ్చిన కథనానికి స్పందించిన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు వైద్యశాలలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలను కలిసి విచారించారు.
కంభం మండలం రావిపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ తిరునాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ తెలిపారు. యోగాంధ్ర- 2025లో భాగంగా బుధవారం స్థానిక తలారిసింగి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు ప్రారంభ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తర్లుపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చక్రపాణి ప్రసాద్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చురుగ్గా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఎస్పీ అమిత్ బర్ధార్ ఆదేశించారు. పాడేరులో బుధవారం నిర్వహించిన జిల్లా క్రైమ్ సమీక్షలో ఆయన మాట్లాడారు.
కొయ్యూరు- వై.రామవరం మండలాల సరిహద్దుల్లో గల బొడ్డేరు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల ప్రమాదకర గోతులు ఏర్పడడంతో పాటు రెండు మండలాలకు చెందిన సుమారు 20 గ్రామాల గిరిజనులకు ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది.
మండలంలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మూడు గంటల పాటు కురిసిన వర్షానికి తీగలేరు వాగుకు వరదనీరు చేరింది.మండలంలోని పడమటి పల్లెలు ఎగువ చెర్లోపల్లి, నల్లగుంట్ల తదితర గ్రామాల్లో చిరు జల్లులు మాత్రమే కురిసాయి.
రహదారి అంతా గోతులమయం. రాకపోకలు సాగించాలంటే నరకం. ఇటుగా ప్రయాణిస్తే ఒళ్లు హూనం కావలసిందే.. ఇదీ బొర్రా- కోనాపురం రోడ్డు పరిస్థితి. కొన్నేళ్లుగా రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ దుస్థితి నెలకొంది.
ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 400 కిలోల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశామని పెదబయలు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆపరేషన్ కగారులో భాగంగా బుధవారం ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది.
మార్గదర్శి బంగారు కుటుంబానికి ఓర్వకల్లు పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం బాటలు వేసింది. పొదుపులక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఐదు మార్గదర్శి బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నారు.
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెలరేగారు (IPL 2025). అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఢిల్లీ క్యాపిటల్స్పై సాధికారిక విజయం సాధించింది.
పొగాకు కంపెనీల మాయా జాలంతో రైతులు మరోసారి నష్టపోయారని, ఈ ఏడాది పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ‘కొనేవారేరీ.?’ అనే కథనానికి అధికా రులు స్పందించారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణాలకు కట్టుబడి ఉన్నానని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ దామోదర్ చెప్పారు. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాలులో బుధవారం జిల్లాస్థాయిలో పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తాళ్లూరు మండల రెవెన్యూ కార్యాలయం వివాదాలకేగాక, ప్రజా సమస్యల పరిష్కారంలో నాన్చుడు ధోరణికీ కేరాఫ్ అడ్ర్సగా మారింది. ఏ సమస్య వచ్చినా నెలల తరబడి తిప్పుకోవడం రెవెన్యూ అధికారులకు పరిపాటి అయ్యింది.
రాజీవ్ యువ వికాసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ తన ఛాంబర్లో రాజీవ్ యు వ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు.
మోదీ నాయక త్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం భారత రాజ్యాంగ స్ఫూర్తికి పూ ర్తిగా విరుద్ధమని రౌండ్ టేబుల్ సమావే శంలో పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అ భిప్రాయపడ్డారు.