నర్సీపట్నం మునిసిపాలిటీలో వార్డు సచివాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పథకాలు, పౌర సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం సొంత భవనాలు పూర్తి స్థాయిలో నిర్మించలేదు. దీంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 17 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్లు గడిచినా వీటికి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో మహిళా మండలి భవనాలు, క్రీడా భవనం, అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నారు.
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో పేరుకు ముగ్గురు స్త్రీ వైద్యనిపుణులు ఉన్నప్పటికీ ఒక్కరూ అందుబాటులో లేరు. ఒకరు చైల్డ్ కేర్ సెలవుపై వెళ్లగా.. మరో ఇద్దరు పాడేరు జిల్లా ఆస్పత్రిలో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు అలా్ట్ర సౌండ్ స్కానింగ్, నెల వారి ఆరోగ్య తనిఖీలు నిలిచిపోయాయి.
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖలో వైసీపీ ప్రభుత్వం సాగించిన అనేక అక్రమాలపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం సిఫారుసుల ముసుగులో ఉపాధ్యాయులను ముడుపులు తీసుకొని అక్రమంగా బదిలీలు చేశారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా నిబంధనలకు విరుద్ధంగా జరిపిన బదిలీలను రద్దు చేశారు.
పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ఇంటి పక్కనే ఉంటున్న మహిళపై ఒక వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం తొలుత పిఠాపురం, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు బైరెడ్డి మట్టారెడ్డి(105) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెం దారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురం మండలం యనమదలలో సాదే జనార్థనరావు హత్యకేసులో అదే గ్రామానికి చెందిన దారా అప్పారావు అతని కుమారులు దారా సింహాద్రి, దారా చంటి, దారా రాజశేఖర్లకు యావజ్జీవ కారాగార శిక్ష రూ.5వేలు చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆర్.శ్రీలత శుక్రవారం తీర్పు చెప్పారు.
సైనికులు దేశభక్తికి నిలువెత్తు ప్రతీకలని ఆర్మీ కళాశాల డైరెక్టర్ కెప్టెన్ రాఖీ చౌహాన్ అన్నారు. శుక్రవారం బీబీనగర్ పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో సెంట్రల్ బ్యూ రో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవం లో ఆమె పాల్గొన్నారు.
మృతి చెందిన వ్యక్తి పేరిట నూతన విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ కుటుంబం మీటర్ బిగింపులో ఆలస్యమవుతోందని జేఎల్ఎంపై దాడి చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఈ సంఘటన జరిగింది.
వారం రోజులుగా గోదావరి ఉధృతి తగ్గుతూ పెరుగుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చి చేరే వరదనీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్రంలోకి ప్రవహించేలోగా మరలా ఎగువున నీటి మట్టం పెరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవే ర్చాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం రాస్తా రోకో ధర్నా నిర్వహించారు.
ప్రస్తుతం మారిన వాతావరణ ప్రభావం వలన దోమల బెడదతో ప్రజలు వైరల్ ఫీవర్లతో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ వైద్యశాలకు వస్తున్నందున వైద్య శాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకో వాలని మార్కాపురం సబ్కలెక్టర్ రాహుల్మీనా కంభం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శివనాయక్కు సూచించారు.
లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, అందు కు చట్టపరంగా జరిమానా ఉంటుందని పట్టణ ఎస్సై గణేశ్కుమార్ హెచ్చరిం చారు. కళాశాల రోడ్డులో లైసెన్స్ లేకుండా ద్విచక్రవాహనాలు నడుపుతూ పట్టు బడ్డ యువకులకు శుక్రవారం కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించారు.
రత్నగిరివాసుడైన సత్యదేవుడి విమానగోపురం స్వర్ణమయం చేసేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం దేవదాయశాఖ స్థపతి పరమేశ్వరప్ప నేత్రుత్వంలో ఒక కమిటీ పరిశీలన జరిపి సుమారు 11కేజీల బంగారం పడుతుందని అంచనా వేయగా దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో శుక్రవారం టీటీడీ డిప్యూటీ ఈఈ చంద్రమౌళీరెడ్డి, అసిస్టెంట్ స్థపతి మురళీశంకర్, అప్రయిజర్ నాగరాజు, సూపరింటెండెంట్ మనోహర్ల బృందం విమానగోపురం కొలతలను తీసుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది గాలి నాణ్యతా పర్యవేక్షణ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అనుమతిచ్చింది. ఏర్పాటు వ్యయంలో 50శాతం సీపీసీబీ, మిగతా 50శాతం తెలంగాణ కాలుష్య నియంత్ర ణా మండలి భరించనున్నాయి.
రోడ్లపై ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకు భద్రత కల్పిస్తుందని తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జీవీకేఎస్వీ ప్రసాద్ అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు హెల్మెట్ ఉపయోగంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.
కాకినాడ నగరంలోని పురాతన సంపద, కట్టడాలను సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వాటర్మెన్ ఆఫ్ ఇండియా రామన్ మెగసెసె అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వనమహోత్సవం’లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ముందుకు సాగడంలేదు. జిల్లాలో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత సంవత్సరం భారీ వర్షాలు కురవగా, ఈసారి వరణుడు ముఖం చాటేశాడు.
రైతులకు ఆపద్బాంధ వుడిలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిలిచారని టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. రూ.కోటితో మోటార్లు కొనుగోలు చేసి రైతు లకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేయగా మండలంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మో టార్లను శుక్రవారం జాస్తి ప్రారంభించారు.
వ్యక్తి ఆత్మహత్యకు వేధింపులే కారణమని పలువురిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని మృతుడి బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు.
సాగునీరు పారాల్సిన కాల్వలు.. తూటికాడ, జమ్ము, రబ్బరు మొక్కలతో నిండిపోయాయి. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చివరి భూములకు సాగునీరు అందించాల్సిన కాల్వలు పూడికతో నిండిపోయాయి. సాగునీటి కాల్వల కట్టలు కోతకు గురై ఉన్నాయి. సాగునీరు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నా పాలకులకు పట్టలేదు. ఐదేళ్లు అటు వర్షాభావం.. ఇటు అరకొర ఉన్న సాగునీరు కాల్వల ద్వారా సక్రమంగా అందక రైతులు అల్లాడిపోయారు. అయినా పాలకులు కాల్వల మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.. రైతుల గోడు ఆలకించలేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో అయినా సాగునీటి కాల్వల బాగుపై దృష్టి సారిస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్కు సాగునీటి ఇబ్బందులు లేకుండా కనీసం తాత్కాలిక మరమ్మతులు తక్షణం చేయాలని రైతులు కోరుతున్నారు.
గ్రామీణ స్థాయి విద్యార్థుల కు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే సదాశ యంతో రాజీవ్గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలు 2008లో ప్రారంభించారు.
గత వారంరోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి నగరంలోని బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది. కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తారు రోడ్డు దెబ్బతిన్నది. పద్మనగర్ శివాజీ జంక్షన్లో ఏర్పడ్డ భారీ గుంతలతో రోడ్డు ప్రమాదకరంగా మారింది.
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: పరిపాలనా సౌల భ్యం దృష్ట్యా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లోని కొంతమంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పి.అశోక్కన్నారావు, జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ సీసీ)ను రెవెన్యూ విభాగంలో రెవె న్యూ ఇన్స్పెక్టర్-3 సర్కిల్కు ఇప్పటివ
సర్పవరం జంక్షన్: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురు వాహనదారులకు న్యాయమూర్తి తలో రూ.10 వేలు జరిమానా విధించినట్టు సర్పవరం పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో వైఆర్కే.శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వ
పెద్దాపురం, జూలై 26: దేశ రక్షణలో సైనికుల త్యాగం అజరామరం అని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి అన్నారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని పట్టణానికి చెందిన మాజీ సైని కుడు డాక్టర్ గుమ్మెళ్ల పట్టాభిరామశేఖర్ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కా
కొత్తపల్లి, జూలై 26: వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్కు వచ్చే కేసులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. కొత్తపల్లి పోలీస్ స్టే
కార్పొరేషన్(కాకినాడ), జూలై 26: కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 2024-25 సంవత్సరానికి రెండో విడత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం ప్రభుత్వ పారిశ్రామికా శిక్షణ సంస్థలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్ ఎం.వేణుగోపాలశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8
ఎస్కే యూనివర్సిటీలో రాజకీయాలకు చోటు లేదని ఏదైనా సరే నిబంధనల ప్రకారమే జరగాలని యూనివర్సిటీ రిజిసా్ట్రర్ రమేశబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాలసునీత సూ చించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఏప్రిల్ నెల వరకు జరిగిన సెల్ ఫోన్ చోరీలకు సంబంధించిన 151 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలను ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ స్వరూపరాణి వెల్లడించారు.
దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్ గున్యా సంక్రమించే అవకాశం ఉందని, దోమల నిర్మూలన సామాజిక బాధ్య తగా భావించాలని జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎస్ ప్రసాద్ అన్నారు.
ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల సేవలు మరువలేనివని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని కే టీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో కార్గిల్ విజయ దివ స్ను ఘనంగా నిర్వ హించా రు. 1999లో కార్గిల్ యుద్ధం లో శత్రుదళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దాదాపు కేజీపైనే నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.67 లక్షలపైనే కాజేశారు. మోసగాళ్లను పట్టుకుని నిలదీస్తే ఆడ్డం తిరిగి నానా రాద్దాంతం చేసి పరారయ్యారు. నరసాపురంలో వెలుగుచూసిన ఈ మోసం బులియన్ వ్యాపారుల్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు.
స్థానిక ఆర్డీటీ క్రీడామైదానంలో నాలుగు రోజులుగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో కొత్తపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల జట్టు విజయం సాధించినట్లు ఆ పాఠశాల హెచఎం పద్మావతి, పీడీ పద్మబాయ్ తెలిపారు.
‘దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి పదిరోజుల క్రితం నిత్యం 209 మంది వైద్యపరీక్షల కోసం వచ్చేవారు. శుక్రవారం ఔట్ పేషెంట్ల సంఖ్య 316కు చేరింది. జ్వరాలు, వాంతులు, విరేచనాలతోపాటు కీళ్లనొప్పుల చికిత్సకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది’
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనిక్ విభాగంలో ఓ నిండు గర్భిణి అడ్మిషన్లో నిర్లక్ష్యంపై శుక్రవా రం ధన్వంతరీ హాలులో నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.
తుంగభద్ర నదికి వరదకాలువను నిర్మించి రాయలసీమను కరువు కోరల నుంచి కాపాడాలని జనవ రుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడును కోరినట్టు ఉమ్మడి జిల్లా సర్పంచల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ తెలిపారు.
కార్గిల్ యుద్ధంలో అమలైన సైనికులకు స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాల శుక్రవారం పలువురు నివాళులర్పిం చారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పట్టణంలోని ఎనసీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వ హించారు.
ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం వైసీపీకే చెల్లుతుందని చిలమత్తూరు మండలం టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి, నాయకులు అన్నారు. శుక్రవారం కొడికొండ చెక్పోస్టులో నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, ము
మండలంలోని కొండాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్పెషాలాఫీసర్, డిపీఓ విజయ్కుమార్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రోగులను పలకరించి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్రూంను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
వక్క మార్కెట్ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. వెలగపూడిలోని రాష్ట్రసచివాలయంలో హోంమంత్రి అనిత, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును శుక్రవారం వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం వారు మధురవాడ మార్కట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుని విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు.
జీవీఎంసీ 8వ వార్డులో గంజాయి సేవించే వారు అధికమవుతున్నారు. గంజాయ్ బ్యాచ్లకు ఈ వార్డు కేరాఫ్గా మారుతోంది. ఈ ప్రాంతంలోని యువకులు పూటుగా గంజాయి సేవించి విచక్షణ రహితంగా ఘర్షణలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిప్యూటీ డీఈఓ నాగరాజు సూచించారు. మండలంలోని కల్యం గ్రామ జిల్లా పరిషత ఉన్న త పాఠశాల, మండల పరిషత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాలను పరిశీలించారు.
సమాజంలో యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని చండూరు పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ (సీఐ) వెంకటయ్య అన్నారు.