[05:51]ఇండోనేసియా ప్రజలను మౌంట్ ఇబు అగ్నిపర్వతం వణికిస్తోంది. ఒక్క జనవరి నెలలోనే ఇది వెయ్యి సార్లకు పైగా విస్ఫోటనం చెందింది. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.
అది అరక పట్టి దున్ని.. విత్తనాలు చల్లే సాగు భూమి కాదు.. ఓ సినిమా హాల్. ఫక్తు కమర్షియల్ ప్రాపర్టీ!! అయినా దానికి రైతుబంధు పథకం వర్తింపజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఇలా ఓ సినిమాటాకీ్సకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు సాయం అందించారు.
[05:51]వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగనుంది. నూతన అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు శ్వేతసౌధం నుంచి ప్రకటన వెలువడింది.
[05:49]ప్రవాసులను స్వదేశాలకు తిరిగి పంపాలన్న డొనాల్డ్ ట్రంప్ యోచనల్ని పోప్ ఫ్రాన్సిస్ ‘ఒక అవమానం’గా అభివర్ణించారు. ప్రవాసుల్ని స్వదేశాలకు తరలించడం వాస్తవమైతే అదో అవమానం, ఎందుకంటే ఆ చర్య నిరుపేదల బతుకు దుర్భరం చేస్తుంది, అని ఆయన అన్నారు.
రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని సకల హంగులతో, అత్యంత భద్రతతో, సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. రహదారి నిర్మాణ ఆకృతి, రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలు, పైపు లైన్లు, టెలిఫోన్ లైన్లు తొలగించి, తిరిగి అమర్చడంపై ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ను రూపొందించేందుకు సలహా సంస్థల(కన్సల్టెంట్లు) ఎంపిక కోసం ప్రభుత్వం ఇటీవల టెండర్లను పిలిచింది.
[05:44]భారత్లో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వేలో తేలింది. ఈ విషయంలో మన దేశం.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది.
[05:44]మహారాష్ట్రలోని బద్లాపుర్లో గతేడాది చోటుచేసుకున్న లైంగిక దాడి నిందితుడి మృతికి ఐదుగురు పోలీసులదే బాధ్యత అని మేజిస్ట్రేట్ విచారణ నివేదిక వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేసిన డోనాల్డ్ ట్రంప్ ఓ వంద ఆదేశాలతో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనలో తీసుకున్న పలునిర్ణయాలను తిరగదోడబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు...
[05:40]పైన డ్రోన్లు.. కింద అత్యాధునిక ఆయుధాలు చేతబూనిన భద్రతా బలగాలు.. .మందుపాతరల నిర్వీర్య దళాలు.. వెరసి మావోయిస్టులకు పెట్టనికోట లాంటి అబూజ్మడ్ అష్టదిగ్బంధంగా మారింది.
గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాలనే పట్టించుకుంటూ రాజకీయాలను విస్మరిస్తున్నారని ఇంటాబయటా విమర్శలు...
గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలో కొనసాగించి, రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం కలిగించింది గత ప్రభుత్వం...
[05:39]దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 18 లక్షల బ్రెయిన్స్ట్రోక్ కేసులు నమోదవుతుండగా సకాలంలో చికిత్స అందక వాటిలో 30% వరకు మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.
[05:38]ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా ‘స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ అడ్మిషన్ (ఎస్ఈఏ)’ కోటా కింద జేఈఈలో జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఐదుగురు విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు కల్పించింది.
[05:36]రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. గత పదేళ్లలో ఏకంగా 32% అంటే దాదాపు మూడోవంతు తగ్గడం గమనార్హం.
[05:35]రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక, కొత్త దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు నిర్దేశించారు.
[05:34]ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
[05:33]రాష్ట్రంలో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1, 2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా..
[05:32]భారీ లాభాలు వస్తాయని ఆశపెడుతూ నిలువునా ముంచే గొలుసుకట్టు మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఐడీ డీజీపీ శిఖా గోయల్ ప్రజలను హెచ్చరించారు. అప్రమత్తతతోనే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు.
[05:29]తెలంగాణలో రైతుల వద్ద మిగిలి ఉన్న పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 25 లక్షల టన్నుల పత్తి సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల సేకరణ పూర్తయిందన్నారు.
[05:28]కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయంతో పాటు అదనంగా తులం బంగారం అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చడం లేదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
[05:27]పంట పొలాలకు నీళ్ల కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
[05:27]వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
[05:26]కాకినాడ జిల్లా వాకలపూడి సమీప ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలోని యూనివర్సల్ బయో ఫ్యూయెల్స్లో ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఉత్తర్వులిచ్చింది.
[05:24]వైకాపా హయాంలో విధ్వంసం జరుగుతుంటే దిల్లీలో కూర్చుని వేడుక చూశారా? అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.
[05:23]పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చే విధంగా ఏపీ భవన నిర్మాణ నిబంధనలు-2017ను సవరించింది.
[05:33]ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర నేతల భద్రతపై ఆందోళన అవసరం లేదని, ఇలాంటి అంశాలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టంచేశారు. పవన్ ఇంటిపై డ్రోన్ తిరగడంపై విచారణ జరుగుతోందని చెప్పారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో
[05:21]కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు విచారణను సుప్రీం కోర్టు సోమవారం నిలిపేసింది.
[05:21]పార్టీలను, రాజకీయాలను పక్కనపెట్టి దావోస్ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో కేంద్రం-రాష్ట్రాలు పెట్టుబడుల కోసం చేతులు కలిపాయి. కేంద్రంతో కలసి ఆరు రాష్ట్రాలు రెండు భవనాల్లో తమ పెవిలియన్లను ఏర్పాటు చేశాయి.
[05:13]కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలనే కీలకాంశంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
[05:20]తమ భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి వైకాపా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మేడా భాస్కరరెడ్డి కాజేశారని అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పీఎస్ గుంటుకానిపల్లెకు చెందిన రమణయ్య వాపోయారు.
[05:19]రాష్ట్రంలో భాజపా జిల్లా అధ్యక్షులను పార్టీ నాయకత్వం మార్చబోతోంది. ప్రస్తుతమున్నవారిలో కొందరు మినహా అత్యధిక స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
[05:18]ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ తదితర రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలో పనులుచేసే గుత్తేదారులు మాదిరిగానే.. జాతీయ రహదారుల పనులుచేసే గుత్తేదారులు కూడా కంకర, మట్టి,..
[05:16]దిల్లీలోని ఏపీ భవన్ను పునర్నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వాటాగా కేటాయించిన భూముల్లో మూడు చోట్ల భవనాల్ని నిర్మించాలని భావిస్తోంది.
‘‘గుట్ట కోసం ప్రాణాలైనా ఇస్తాం. మైనింగ్ను జరగనివ్వబోం’’ అంటూ నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి.. పురుగు మందు డబ్బాలతో సోమవారం ఆందోళనకు దిగారు.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
[05:08]బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహ్మద్ రొహిల్లా అమిన్ ఫకీర్ తన చిత్రాన్ని టీవీల్లో చూసి భయాందోళనకు గురయ్యాడని పోలీసు అధికారి సోమవారం వెల్లడించారు.
[05:07]రాష్ట్రాల అసెంబ్లీలు సమావేశమయ్యే రోజుల సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకుగానూ అసెంబ్లీ స్పీకర్లు ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
[05:07]‘లోకేశ్ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలని తెదేపా నాయకులు, శ్రేణులు కోరుకుంటున్నట్లుగానే, పవన్కల్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని మేమూ అనుకుంటున్నాం. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాజకీయ అలజడులు సృష్టించేందుకు వైకాపాకు అవకాశం ఇవ్వకూడదు.
[05:04]అదృష్టం అనేది యాదృచ్ఛికంగా ఎదురయ్యేది కాదు! అది వరించే పరిస్థితులను మనమే సృష్టించుకోవాలి. ఎక్కువ నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మనం అదృష్టవంతులుగా మారొచ్చు.
[05:03]తితిదే ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. సోమవారం నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు.
[05:05]లోకేశ్ను ఉపముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు తెదేపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని నాయకులను ఆదేశించింది.
[05:05]పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలో టీ 16 ప్లాస్టిక్ కాంక్రీటు సమ్మేళనం వినియోగించడానికి కేంద్ర జలసంఘం పచ్చజెండా ఊపింది. కొత్త డయాఫ్రం వాల్ పనులు శనివారం ప్రారంభం కాగా..
[05:04]అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. దాంతో స్థానికులు గజగజ వణుకుతున్నారు.
రాష్ట్రంలో కొన్ని రోజులపాటు తగ్గిన చలి తీవ్రత మళ్లీ తన తడాఖా చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్ డిజిట్కు పడిపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
[04:54]ప్రభుత్వం, వ్యాపారాలు, మీడియా, స్వచ్ఛందసంస్థలపై ప్రజల విశ్వాసం విషయానికొస్తే భారత్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ముందు ఎడెల్మన్ ట్రస్ట్ బారో మీటర్ వార్షిక ర్యాంకింగ్స్ను విడుదల చేసింది.
[05:00]ఏపీలో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (పీజీఏ) ప్రామాణిక గోల్ఫ్ సిటీ ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని స్టోన్ క్రాఫ్ట్ గ్రూపు ప్రతినిధులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు.
[04:58]ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్-ఈసీ) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులనిచ్చింది.
[04:57]అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్, నైపుణ్య శిక్షణ కేంద్రం (ట్రైనింగ్ స్కూలు) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,890 కోట్లు కేటాయించినట్లు సమాచారం.
[04:56]‘యంగ్ ఇండియా ప్రాజెక్టు’ ద్వారా నిరుపేద ప్రజలకు సేవలందించిన నరేంద్రసింగ్ బేడి (94) సోమవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు గ్రామంలోని తన కార్యాలయంలో మృతి చెందారు.
[04:55]రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే సోమవారం నుంచి పునఃప్రారంభమైంది. 627 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో 37.11 లక్షల ఎకరాలకు కొలతలు వేస్తున్నారు.