అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చిన్నపాడు పంచాయతీ గోపవరానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం సికిల్సెల్ అనీమియాతో మృతిచెందింది. ఆమె సోదరి కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో ఉంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దవళ దారబాబు, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు భాగ్యశ్రీ (10), యోధశ్రీ (6). ఇద్దరూ సికిల్సెల్ అనీమియా వ్యాధితో బాధపడుతున్నారు.
విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం కావటానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపి స్తోంది. ల్యాంకో ట్రాన్స్మిషన్ హైటెన్షన్ టవర్ లైన్లకు సంబంధించి ఏం చేయాలన్న దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మినిసీ్ట్ర ఆఫ్ రోడ్స్, టాన్స్పోర్టు, హైవే.. మోర్తు) చైర్మన్ నుంచి స్పష్టత రాకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంలో మోర్తు చైర్మన్ పశ్చిమ బైపాస్ను పరిశీలించారు.
సీఎం తో సమస్యలు చెప్పుకున్నారు..వెంటనే పరిష్కా రం చూపారు.. హామీలు ఇచ్చారు..జనం మురి సేరు..మా బాబే అంటూ జేజేలు పలికారు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల పరిధిలోని రెండు గ్రామాల్లో శనివారం ఆరు గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆద్యంతం ఆస క్తిగా సాగింది.
నువ్వు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు. మేము అడిగిన డబ్బు పంపకుంటే కేసు పెడతాం’ అంటూ గతంలో బియ్యం వ్యాపారం చేసిన 74 ఏళ్ల వెంకటేష్ గుప్తాను సైబర్ నేరగాళ్లు శనివారం బెదిరించారు.
న్టీఆర్ భరోసా సామాజిక భధ్రతా పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది. 2,60,379మందికిగాను శనివారం రాత్రి 7గంటలకు 2,45,837మందికి పింఛన్ల కింద రూ.105.22 కోట్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, ఏపీడీ ప్రభావతి చెప్పారు.
అర్హులైన సీనియర్ టీచర్లకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యిన నేపథ్యంలో, ఉద్యమ లక్ష్యాల సాధనపై విమర్శనాత్మకంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చోటుచేసుకున్నా, నియామకాలు, ఆర్థిక స్థితి, పరిపాలనలో అసమతుల్యతలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో పేదలకు టిడ్కో ఇళ్లు ఎప్పటికి అప్పగిస్తారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఏళ్ల తరబడి ఇళ్లు అందక లబ్ధిదారులు లబోదిబోమంటుంటే, ఈ ఇళ్ల కోసం నాడు ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి.
హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు.
మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్నగర్ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
వేసవి సెలవుల విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవు తున్నాయి. ఈ ఏడాది నుంచి నూతన విద్యావిధానాన్ని ఇంటర్ విద్యలో ప్రభుత్వం ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేసే విధంగా పలు సంస్కరణలతో విద్యార్థులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టింది.
సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా సీమ రైతాంగం అలుపెరుగక పోరాడుతున్నదని, ఎప్పటికైనా పాలకులు ప్రజలకు తలొగ్గాల్సిందేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
‘కాలం చాలా వేగంగా మారిపోతోంది. ప్రతీ జిల్లా అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఉత్తమ ఫలితాల సాధన సాధ్య మవుతుంది.’ అని గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ అన్నా రు.
కౌలు రైతులకు ఆటంకాలను అధికమించి సులభంగా రుణాలు అందిం చాలని వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలని జాయింట్ కలెక్టర్ బి.నవ్య జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు.
జిల్లా పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. పోలీసులు చలానాలు విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనదారులు ఖాతరు చేయడం లేదు. నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నా మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ సార్లు నిబంధనలు ఉల్లఘించిన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు.
శ్రీశైలం నియోజక వర్గంలోని సున్నిపెంట సీహెచ్సీని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని తిర్మలాపూర్కు మార్చారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని పెట్రోల్ బంక్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించాలని రెండు రోజుల క్రితం అనుకున్నారు. ముందుగా ఖరారు చేసిన స్థలం సమాంతరంగా లేకపోవడం, పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో సభ ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వలేదు.
జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టం చేస్తున్నారు. అన్ని షాపులకు సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులలో మద్యం లూజ్ విక్రయాలు చేయకూడదు. ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లకు మించి ఇవ్వకూడదు. మద్యం బాటిల్ మీద ఉన్న నిర్ణీత ధర కంటే అధిక ధరకు విక్రయించకూడదు. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉన్న కారణంగా మద్యం షాపుల పర్యవేక్షణ ఎక్సైజ్ అధికారులకు కష్టతరంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు.
నాలుగేళ్ల తరువాత రేషన్ డిపోల డీలర్లు తమ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరకులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకటో తేదీ నుంచి సరకుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా కాకుండా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరకుల పంపిణీ అని చెప్పి రోడ్లపైనే ఎండలో నిలబెట్టి పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
మండలంలోని చింతలపూడి పంచాయతీలోని శివారు గ్రామాల్లో శనివారం పింఛన్లు పంపిణీ చేయడానికి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా మత్స్యశాఖ గ్రామ సహాయకుడు అబ్దుల్ రజాక్, ఉద్యాన వన శాఖ సహాయకుడు డి.వరుణ్కుమార్ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు.
ఎండల వేడి తగ్గి వాతావరణం చల్లబడుతుండగా, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు జూన్ ‘ఫీవర్’ మొదలైంది. వేసవి సెలవులు ముగి సి మరో 12 రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లల చదువులు, పంటల సాగు ఖర్చు తలుచుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు కంటిమీద కునుకు కరువవుతోంది.
నిజాం కాలం నాటి భవనాలు. కొన్ని కూలిపోగా, మరికొన్ని కూలిపోయే దశకు చేరుకున్నాయి. వర్షాకాలం ఆరంభం కావడంతో ఈ భవనాలు ఏ సమయంలో నేలమట్టమవుతాయోనన్న భయం ప్రజల్లో నెలకొంది. చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలు దశాబ్ధాల క్రితం నాటి భవనాల్లో కొనసాగుతున్నాయి.
పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, షూ, బెల్టుతో కూడిన కిట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ముందుగా ఇండెంట్ మేరకు జిల్లాకు పుస్తకాలు వచ్చాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. జిల్లాలో 5,13,837 పాఠ్య పుస్తకాలు అవసరమని ఇండెంట్ పెట్టారు.
సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు మూలమని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య అన్నారు. శనివారం కొత్తపల్లిలోని అల్పోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఉపాధ్యాయుల మూడో దశ వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు విశ్లేషనాత్మకంగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
బస్టాండ్.. ఆటో స్టాండ్.. టాక్సీ స్టాండ్.. రిక్షా స్టాండ్.. ఇవన్నీ ఆయా వాహనాలు నిలిపిఉంచే ప్రాంతాలు. కానీ బస్టాండ్ మాత్రం దీనికి విరుద్ధం. ఇక్కడ బస్సు నిలిపి ఉంచే ప్రదేశంలో బస్సు బదులు ప్రయాణికులు నిలిచి ఉండే ప్రదేశం అని అర్థం చేసుకోవాలి.
ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలు పరిష్కరిం చనున్నట్లు ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.శనివారం రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో 50 వరకు వినతులు స్వీకరించారు.
వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కల్వకుంట్ల కవిత పాత్రధారిగా చార్పత్తా సినిమా నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ విమర్శించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
విజయనగరంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ జలమయమ య్యాయి. రైల్వే ఆండర్ బ్రిడ్జి, సిటి బస్టాండ్ తదితర ప్రాంతాల్లో నడుమ లోతులో నీరునిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.
[00:03]ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులను అధిగమించిన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ (Opal Suchata Chuangsri) 72వ ‘మిస్ వరల్డ్ 2025’ (Miss World 2025) కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమె నేపథ్యాన్ని ఓ సారి పరిశీలిస్తే..
మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగటం నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్జడ్జి కె వెంకటేష్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ సీతారాంపురంలోని జిల్లా సెంట్రింగ్ ఓనర్స్ సొసైటీ భవనంలో చట్టాలపై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు.
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, హెచ్చరిక లను చాలా మంది పెడచెవిన పెట్టి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ గీతాబాయి అన్నారు.