జిల్లాలో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ధరణి చట్టాన్ని సవరించి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తీసుకవస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనున్నది. భూముల రిజిస్ట్రేషన్లకు అధీకృత మ్యాప్ జత చేయాలని చట్టంలో మార్పులు చేయడంతో సర్వేయర్లకు డిమాండ్ పెరగనున్నది. ప్రభుత్వ పరంగా తక్కువ మంది మాత్రమే సర్వేయర్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లను ఎంపిక చేసి వారికి మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది.
జగిత్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆగస్టులో ఎంబీబీఎస్ మరో బ్యాచ్కు భవనాలు అవసరం కానున్నాయి. నిధులు లేకపోవడం వల్ల పనులు నిలిచిపోయినట్లు వైద్య కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల భవనాల పనులకు గత ప్రభుత్వం రూ.132 కోట్లు నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరు 7వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ భూమి పూజచేసి పనులు ప్రారంభించారు.
[01:44]అల్లు అర్జున్ - అట్లీ కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని వచ్చే నెలలోనే సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు హైదరాబాద్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఒంగోలులో రోడ్లకు మహర్దశ వచ్చింది. నగరాభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సెంటర్ డివైడర్ల నిర్మాణం, పచ్చని మొక్కలు నాటడం, లైటింగ్ ఏర్పాటు చేయడంతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. అందుకనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం పెద్ద సమస్యగా మారింది.
[01:38]కొత్త నటులు బాలు, షిన్నోవా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒక బృందావనం’. శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కల్యాణి రాజు, మహేంద్ర, డి.డి.శ్రీనివాస్ ఇతర పాత్రలు పోషించారు.
జిల్లాలో మండు వేసవిలో వాన జోరు కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు, ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సిన సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర గురువారం కరీంనగర్లో జరగనున్నది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పన్నెండేళ్లుగా ఏక్తా యాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ఆనవాయితీలో భాగంగానే గురువారం భారీ ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి 50 వేల మంది హాజరవుతారని భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాం లో ప్రారంభించిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా రేషన్ పంపిణీ ఇక నిలిచినట్లే. ఇటీవల కాలంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడంతోపాటు ప్రభుత్వంపై అధికభారం పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చకు దారితీసింది.
జిల్లా విద్యాశాఖలో బదిలీల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఉద్యోగుల స్థానచలనాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. దాన్ని ఈనెల 2లోపు పూర్తి చేయాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
వచ్చే నెల 21వ తేదీ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ విశాఖపట్నంలో నిర్వహించనున్న ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ను ఎంపిక చేశారు. బీచ్రోడ్డు, పక్కన ఇసుక తిన్నెల్లో 15 వేల మంది యోగా ప్రదర్శన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వప్రియ ఫంక్షన్హాలుకు ఎదురుగా ప్రధాన వేదికను ఏర్పాటుచేయనున్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో మరో సీనియర్ అధికారి రాజీనామా చేశారు. యాజమాన్యం ఒత్తిళ్లు భరించలేకే ఆయన సర్వీస్ నుంచి వైదొలగారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించగా స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో జడ్పీ, మునిసిపల్, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో 93 గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జిల్లా విద్యా శాఖ గుర్తించింది. ఒక పాఠశాలలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో అటువంటి హెచ్ఎంలు 15 మంది ఉన్నారు.
నగరంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్లోని సమావేశ మందిరంలో సీఐ అంతకంటే పైస్థాయి అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
కూటమిలోని టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మిత్రపక్షాల మధ్య పెద్ద దుమారమే రేగింది. తొలుత టీడీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు/పెందుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే (జనసేన) చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారని, పార్టీ ఇన్చార్జికి విలువ ఇవ్వడం లేదన్నారు. తమ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో మలేరియా కార్మికుల పోస్టుల పందేరం నడుస్తోంది. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు తాత్కాలిక ప్రాతిపదికన 431 మందిని నియమించుకునేందుకు ఇన్చార్జి కమిషనర్గా ఉన్న జిల్లా కలెక్టర్ అనుమతిచ్చారు.
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంచాయితీ కొలిక్కివచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఫ్లోర్లీడర్గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్లీడర్గా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావుకు అవకాశం కల్పించాలని మేయర్తోపాటు కొందరు ఎమ్మెల్యేలు భావించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన కొందరు...కనీసం ఫ్లోర్లీడర్గా అయినా అవకాశం ఇవ్వాలని తమకు సన్నిహితంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ
గుల్జార్హౌస్ వద్ద అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో విద్యుత్ భద్రతానిబంధనలను కఠినంగా పాటించాలంటూ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ప్రజలకు సూచించింది. హాస్పిటల్స్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్స్, బహుళ �
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావస్తున్నందున...కనెక్టివిటీ కోసం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మిస్తున్నదని, అయితే నగరంలో ట్రాఫిక్ రద్దీ తట్టుకోవడానికి ఫ్లైఓవర్లు కూడా అవసరమని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. వీఎంఆర్డీఏలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖా మంత్రి పి.నారాయణ బుధవారం సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యేలంతా వారి వారి సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సూచనలు తెలియజేశారు.
కాళేశ్వరం గ్రామం.. చుట్టూ అభయారణ్యం.. పకనే కాళేశ్వర-ముక్తీశ్వరాలయం.. చెంతనే గోదావరి, ప్రాణహిత, సరస్వతీ (అంతర్వాహిని) సంగమం. నిత్యం రద్దీగా ఉండే ఈ గ్రామంలో అటవీశాఖ అతిథుల కోసం మంచి విడిదిని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప�
కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యల్�
దేశ రక్షణకు కావాల్సిన ఆయుధాల తయారీకి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేస్తామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. బుధవారం ఐఐటీహెచ్లో మీడియాతో ఆయన మాట్లాడారు.
డీఎస్సీకి దరఖాస్తులు పోటెత్తాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నిరు ద్యోగులు లక్షలాదిగా పెరిగిపోయారు.
దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని పెహల్గాంలో జరిగిన దారుణ ఘటనకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రధానమంత్రి మోదీ వైఫల్యం చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఆహ్వానకమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
ఇసుక చాలా ప్రమాదం.. ఎలా జారిపోతామో తెలియదు.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అలాగే జరుగుతుంది. వాహనదారులు వెళుతూ వెళుతూ పడిపోతే ఆ వెనుక వచ్చే వాహనాలు వారిపైనుంచి వెళ్లిన సంఘటనలు ఇటీవల కోకొల్లలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూదాన భూముల రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భూమిపై హక్కు ఉన్నా ఆన్ లైన్లో మార్పులు చేర్పులు జరగక..ఏ పథకాలు వర్తించక నానా తంటాలు పడుతున్నారు.
ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్టాక్ పాయింట్ను సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ జి.మమ్మీ బుధవారం పరిశీలించారు.
నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. పట్టుమని పది నిమిషాలు చిన్నపాటి వర్షం పడితే చాలు.. రోడ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో జనాభాకు తగిన విధంగా డ్రెయినేజీ వ్యవస్థ లేదు.
ఏరియా ఆసుపత్రికి మీరు ఇద్దరేనా.... ఉద్యోగులు మిగతా వారు ఎక్కడా.. మీ ఏడీఏ లేరా.. శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రిని కనీసం మీరైనా శుభ్రపర్చండి.. ఇక్కడ పశువులకు ఏవిధంగా సేవలు అందిస్తు న్నారు.. ఇలా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరం ఏరియా పశువైద్యశాలను సంద ర్శించి అక్కడున్న ఇద్దరు ఉద్యోగులను ప్రశ్నిం చారు.