కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడం, నగరాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఫోరం ప్రధాన లక్ష్యమని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు.
నగరంలో సినీ హీరో వీజే సన్నీ, కమెడియన్ సప్తగిరి సందడి చేశారు. బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్స్టాపబుల్ ఈ నెల 9న విడుదల కానున్న సందర్భం గా బందర్ రోడ్డులోని పీవీపీ మాల్లో సినిమా ప్రమోషన్ను శుక్రవారం నిర్వహించారు.
ఆమె వయసు 75 ఏళ్లు. ఆమె భర్త గ్రామ సర్పంచ్గా ఏకఛత్రాధిపత్యంగా 25 ఏళ్ల పాటు పనిచేసి అప్పటి టీడీపీ, కాంగ్రెస్ నేతల గౌరవం పొందారు. ఆయన లెగసీతో వైసీపీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు సర్పంచ్గా పోటీచేసి గెలుపొందిన పెద్దావిడ మనసు ఇప్పుడు కష్టపడింది. అభివృద్ధి పనులకు తనను ఆహ్వానించ పోవడంతో చందర్లపాడు మండలంలోని గుడిమెట్ల సర్పంచ్ చిన సైదమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.
హర్ష క్రియేషన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరా య గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సాంఘిక నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
జిల్లాలో భూముల ధరలను స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ భారీగా పెంచేసింది. అనంతపురం సమీపంలో అత్యధికంగా 400 శాతం పెంచి పడేశారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 30 నుంచి 100 శాతం వరకు ధరలు పెంచారు. పట్టణాల పరిధిలో 30 నుంచి 40 శాతం పెంచారు. కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ ధరకు సమానంగా రేట్లను నిర్ణయించారు.
వానాకాలం పంటలకు సబంధించిన నీటి విడుదలపై కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఈ విషయాన్ని త్వరలో రైతులకు తెలియజేస్తామని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శంకర్ తెలిపారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
2024 ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మో హన్ అఖండ విజయం సాధిస్తారని, ఈ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్య లను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం పిలు పునిచ్చారు.
జిల్లాలో సాధారణ ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో ఎన్టీఆర్ జిల్లాకు కొత్తగా 1,800 ఈవీఎంలు రానున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం జిల్లాలకు నూతన ఈవీఎంలను సరఫరా చేయటం కోసం ఇండెంట్ కోరింది. ప్రస్తుతం కలెక్టరేట్ గోడౌన్లో ఉన్న ఈవీఎంలు 2004 నుంచి ఉపయోగిస్తున్నవే. ఆ తరువాత 2014లో కొత్త ఈవీఎంలు వచ్చాయి. అయితే, 2024లో నిర్వహించే ఎన్నికలకు ఈ ఈవీఎంలను ఉపయోగించకూడదనే కొత్తవి తెప్పించినట్టు తెలుస్తోంది.
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ఏడాది నుంచి మెడికల్ కాలేజీ వచ్చేస్తోందని ఊరిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీ అనుమతి వచ్చిన మరుక్షణమే సకల సదుపాయాలతో కూడిన వైద్యం అందుతుందంటూ ప్రజాప్రతినిఽధులు హోరెత్తించారు.
గ్రానైట్ పరిశ్రమపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సీనరేజీ వసూలును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. నెలకు రూ.57.88కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,389 కోట్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా సరికొత్త ప్రక్రియకు తెరతీసింది.
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం విలవిల లాడుతున్నారు. రెండు నెలలుగా ఎంతోమంది వడదెబ్బ బారిన పడ్డారు.
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు క్షేమం గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమ పథకాలున అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత పాలనలో రైతుల ఆత్మహత్యలు ఎటూ చూసిన బీళ్లుగా కనిపించే పొలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
జిల్లాలోని 76 రైతు వేదికల వద్ద రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రావతరణ వేడుకల అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని ఆయా శాఖల్లో పని చేస్తున్న అధికారులకు అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
మండలంలోని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్యులు ఉన్నా టెక్నీషయన్లు లేవపోవడంతో రోగ నిర్ధారణ పరీక్షలకు పాట్లు పడుతున్నారు.
వారంతా అధికారపార్టీ అనుచరులు. మంత్రి పేరు చెప్పుకుని పబ్బం గడుపుకొనేవారు. అధికారం అండతో.. రెవెన్యూ సిబ్బంది సహకారంతో విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేశారు.
అనకాపల్లి, చోడవరం, బుచ్చెయ్యపేట మా ర్గాల్లో ఆటోల్లో ప్రయాణం సాగిస్తూ మహిళల మెడల్లో బంగారాలను అపహరిస్తున్న ఒక మహిళతోపాటు మరొకరిని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు.
పట్టణంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందుతున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లోని అనేక గ్రామాలకు ఈ ఆసుపత్రే పెద్ది దిక్కు. నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. అయితే, ఇక్కడ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై 25 రోజులు కావస్తున్నా నోటిఫికేషన్ విడుదల కాలేదు.
అకాల వర్షాలు... ప్రతికూల వాతావరణం ఈ ఏడాది మామిడి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే చివరికి నిరాశ మిగిలింది. మసి, మంగు తెగుళ్లతో నల్లగా మారడంతో పాటు వడగండ్లతో మరింత నష్టం వాటిల్లింది.
మండల విద్యాఽధికారి (ఎంఈవో)-2 పోస్టులు మంజూరు ఎప్పుడన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పోస్టులను ఇప్పటికే గ్రేడ్-2 హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసి భర్తీచేస్తారా? లేక స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి ఇచ్చి నియమిస్తారా? అన్న విషయంలో చిక్కుముడి ఇంకా వీడలేదు.
గ్రామంలో కొళాయిల ద్వారా చుక్కనీరు రావడం లేదని, గొంతు తడుపుకొందా మనుకుంటే గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని మండలంలోని గంగాడ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలోని సచివాలయాన్ని సెగిడి వీధి, కొండవీధికి చెందిన మహిళలు ముట్టడించారు.
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్పై వైసీపీ నాయకులు కోడిగుడ్లతో దాడిచేయడం పిరికిపంద చర్య అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. శుక్రవారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుకు సంబంధించి 409.77 ఎకరాలు, 594 పీడీఎఫ్లపై జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చాలని సర్పంచ్ బాబూరావుతో పాటు గ్రామ స్థులు కోరారు.
మండలంలోని అల్మాస్పూర్ గ్రామ శివారులోని రంగం చెరువుతో పాటు అటవీ ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు చదును చేస్తూ అక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొంటూ శుక్రవారం సుమారు 400 మంది గ్రామస్థులు, రైతులు, మహిళలు కలిసి కట్టుగా తరలి వెళ్లారు.
నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు.. అదుపు లేకుండా పోతోంది. సహజ వనరులను దోచుకునేందుకు తెగబడుతున్న వ్యక్తులు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు ఎదురుకానున్న తాగునీటి సమస్యను పట్టించుకోవడం లేదు. ఊటబావుల చెంతనే లోతుగా తవ్వుకుపోతున్నారు. ఎస్.కోట మండలంలోని మామిడిపల్లి, వేములాపల్లిలో గోస్తనీ తీరాన్ని ఇసుక తవ్వకాలకు అడ్డాగా మార్చేశారు. రేగిడి మండలంలో నాగావళి తీరంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
రాజమండ్రిలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోకు మహిళలు, యువకుల్లో మంచి స్పందన లభించిందని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు.
మల్లాపూర్ మండలంలో మూసివేసిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో నాయకులు, రైతులు నల్ల జెండాలతో శుక్రవా రం నిరసన తెలిపారు.
మీ ఊరు లేదా పట్టణం ప్రధాన మార్గం పక్కనే ఉందని ఇన్నాళ్లు మురిసిపోతూ వచ్చారు. ఏ క్షణాన ఊరికి చేరాలన్నా అలవోకేనంటూ సంబర పడ్డారు. జగన్ సర్కారుకు మాత్రం ఇదే వరమైంది. బాదుడుకు మార్గమైంది. రిజిస్ట్రేషన్ చార్జీల పేరిట భారీగా బాదేశారు.
రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యం లో నిరుద్యోగ యువ తకు ఉద్యోగ కల్పనలో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వార్గనికి సంబంధించి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు.
విజయనగరం నుంచి ఎస్.కోటకు వెళ్లే రహదారిలో గంట్యాడ గ్రామ సమీపంలో ఏర్పాటుచేస్తున్న టోల్ప్లాజ్కు భూము లు ఇవ్వాలని ఆయా రైతులకు ఆర్డీవో సూర్యకళ సూచించారు.
జిల్లాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఉద్యోగుల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజుల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. బదిలీల జాబితాలు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత విడుదల చేసినా వాటిలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దార్శనిక పాలన అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ప్రశసించారు.
చెత్త తరలింపు వాహనాల నిర్వహణలో అధికారులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేతినిండా బడ్జెట్, బోలెడంత పని, వందలాది మంది సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ పారిశుధ్య, ఇంజనీరింగ్ పనుల్లో కీలకమైన వాహనాల నిర్వహణలో మాత్రం భువనగిరి మునిసిపల్ యంత్రాంగం పట్టించుకోవడంలేదు.
[00:08]కెనడాలోని సుషి రెస్టారెంట్లో ఓ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని టిక్టాక్ వేదికగా పంచుకున్నారు. ‘మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇలా వెక్కిరిస్తారా’ అంటూ ఆమె మండిపడ్డారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది.
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు స్టార్టప్లతోనే పరిష్కారం దొరుకుతుందని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు అన్నారు.
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంగా సిద్దిపేట ఐటీ టవర్ తెచ్చినట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.
ఎండాకాలం బార్లీ నీళ్లు, బార్లీ పానియాలు తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బార్లీ గింజలతో కిచిడీ, లడ్డూలు, ఖీర్, వడలు చేసుకుని తింటే రుచితో పాటు
గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీస�
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తప్పవని రిటైడ్ జడ్జి సాంబశివరావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల కోర్టు ఆవరణలో ట్రాఫిక్ లోక్ అదాలత్ నిర్వహించారు.
మండలంలోని కోటకందుకూరు గ్రామంలోని వీరభద్ర దేవాలయ నిర్మాణానికి హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు రూ.1,00,116 విరాళాన్ని దేవాలయ కమిటీ నిర్వాహకులకు శుక్రవారం అందించారు.
[23:59]ఒడిశాలో ఘోర రైలు ప్రమాదంతో ఏపీ సహా నాలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఆయా రాష్ట్రాల్లో రైల్వేశాఖ అధికారులు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
పెళ్లి తరువాత చాలామంది మహిళల కెరీర్ అర్థంతరంగా ఆగిపోతోంది. ఇల్లు, పిల్లల్ని వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ ఉద్యోగం చేద్దామనుకున్నా... దొరకడం కష్టమైపోతోంది. తనకు ఎదురైన ఈ సమస్య మరొక ఇల్లాలికి రాకూడదనుకున్నారు 30 ఏళ్ల శాంకరీ కర్పగం. అలాంటివారందరి కోసం ‘..
తాళ్లరేవు, జూన్ 2: కౌలురైతు గుర్తింపుకార్డులకు భూయజమానులు అంగీకరిస్తేనే వ్యవసాయం సాగుచేస్తామని లేకుంటే సాగుకు దూరంగా ఉంటామని కౌలు రైతులు నిరసన తెలిపారు. శుక్రవారం మండలంలోని జార్జీపేట, నీలపల్లి గ్రామాల కౌలురైతులు జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు అధ్యక్షతన సమావేశమయ్యా
ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం సహజంగా మారుతోంది. మండలవ్యాప్తంగా కొండలు, గుట్టలు అధికంగా ఉన్నాయి. వన్యప్రాణులకు అక్కడ రక్షణ కరువైంది. నెమళ్లు, జింకలు ఆహారం, నీరు లేకపోవడంతో గ్రామాలబాట పడుతున్నాయి.
నేను తీగబచ్చలిని. రెండురకాలుగా పెరుగుతాను. ఆరు రుచులూ నాలో ఉన్నాయి. నేను ఉండగా ఇంక మీకు ఇతర కూరగాయలతో పనేమిటీ?ఖ అని అడిగి, అన్నంలో తినేటప్పుడు బచ్చలాకు కూర కమ్మగా
పాఠ్య పుస్తకాలు ఉంటేనే బోధన సజావుగా సాగుతుంది. కళాశాల ప్రారంభం రోజున విద్యార్థుల చేతుల్లో వాటిని ఉంచితే ఆ ఆనందమే వేరు. జిల్లాలో 23 ప్రభుత్వ, 3 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.