జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసి స్తూ కల్వకుర్తి పట్టణంలో శివాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో నిరసన వ్యక్తం చే శారు. అనంతరం కొవ్వొత్తు లతో ర్యాలీ నిర్వహించారు.
తోటపల్లి కాలువల సమస్య పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు కాలువసమస్యలపై మే ఆరోతేదీన సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వాలు తమ విధానాల పట్ల పునరాలో చించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం గరు గుబిల్లిలో మే 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సంబంధించి సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి తెలిపారు. ఆదివారం గుమ్మలక్ష్మీపురంలోని క్యాంపు కార్యాలయంలో విలే కరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు.
): సాలూరు గ్రామదేవత శ్యామ లాంబ అమ్మవారి పండగను విజయవంతంగా నిర్వహించాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. ఆది వారం పట్టణంలో శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిం చారు.
Consequences for Pakistani Citizens Not Leaving India: ఏప్రిల్ 22, పహల్గామ్… అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి యావత్ భారతావనిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ముఖ్యంగా మత గుర్తింపుతో పౌరుల ప్రాణాలు తీశారు. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతూ పాకిస్తాన్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటోంది.
జాతీయ రహదారి తాళ ్లవలస వద్ద ఆ దివారం పెను ప్రమాదం తప్పింది. వివ రాల్లోకి వెళ్తే.. టెక్కటి నుంచి విశాఖ వైపు గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీకి ముందు టైరు పేలడంతో రైన్గ్రేజ్ పైనుండి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపైకి దూసుకుపోయింది.
జిల్లాకు పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటికే 3,21,757 పుస్తకాలు చేరాయి. పాఠశాలల పునఃప్రారంభం కాకముందే పాఠశాలలకు పుస్తకాలను చేరవేయాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
జిల్లాలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. నివాస గృహాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇలా అన్నింటిలోనూ వినియోగం పెరుగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పంచా యతీరాజ్ ఇంజ నీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చే యాలని రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేసింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసిన అవసరం ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.
No Water... Village Deserted ఒకప్పుడు ఎంతో కళకళలాడేది టచ్చిడి కొండ శిఖర గ్రామం. కేవలం నీటి సదుపాయం లేని కారణంతో ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. మండల కేంద్రానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గ్రామంలో గతంలో 80 ఇళ్లు ఉండేవి. అయితే తాగునీటి వసతి లేక చాలామంది ఆ గ్రామాన్ని ఖాళీ చేశారు.
Insurance scheme ఉపాధి హామీ పథకం వేతనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వం ఉపాధిహామీ వేతనదారులను వైఎస్ఆర్ బీమాలో చేర్చాలని ప్రయత్నించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. వేతనదారులు ప్రమాదాలకు గురైనా, పనిచేసే చోట ప్రాణాలు కోల్పోయినా పెద్దగా ఆర్థికసాయం అందలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి వేతనదారులందరికీ బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.
good Price జిల్లాలో జీడి పిక్కల ధర ఆశాజనంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ దృష్ట్యా వాటి ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ‘మన్యం’లో కిలో జీడి పిక్కల ధర నాణ్యతను బట్టి రూ.150 నుంచి రూ.162 వరకు పలుకుతోంది. దీంతో గిరిజనులు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశం ఉగ్ర వాదాన్ని సమష్టిగా ఎదుర్కొంది. మతోన్మాదం, ఉగ్రవాదం, సామ్రాజ్య వాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్వో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ పిలుపునిచ్చారు.
మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇందుకు వరంగల్ జరిగే రజతోత్సవ సభ ఒక వేదికని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్వంత మైదానంలో తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది
పత్తికొండ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం గాలివాన భీభత్సం సృష్టించింది. హోసూరు రహదారిలో చెట్టు రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. ఆ సమయంలో వెళుతున్న ఆటోపై చెట్టు కొమ్మలు పడ్డాయి.
[23:16]దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
Women targeted జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. దుండగులు బైక్లపై వచ్చి రోడ్లపై ఒంటరిగా నడిచివెళ్తున్న మహిళలను వెంబడించి వారి మెడలోని బంగారు ఆభరణాలను తెంచుకుని పరారవుతున్నారు. ఆరుబయట, ఇళ్లలో నిద్రిస్తున్న మహిళలను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Will the Suspense End? పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్సీ రిజర్వ్కు కేటాయించిన చైర్పర్సన్ ఎన్నిక ఇప్పటికే రెండుసార్లు కోరం లేక వాయిదా పడింది. వైసీపీ, కూటమి సభ్యులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈసారైనా ఉత్కంఠకు తెరపడేనా? అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
విద్యారం గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న అనేక సమస్యలు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా పరిష్కారానికి నో చుకోలేదు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, పెండింగ్ బిల్లుల పరిష్కారం, తెలంగాణలో 2వ పీ ఆర్సీ, పెండింగ్ డీఏల ప్రకటన, ప్రాథమిక పాఠశా లల్లో పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీ వంటి అనేక స మస్యలకు పరిష్కారం చూపకపోవడంతో విద్యారం గంపై తీవ్ర ప్రభావం చూపింది.
Unyielding Elephants భామిని మండలం నేరడి బ్యారేజ్ సమీపంలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న ఏనుగులు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం రాత్రి నేరడి వంశధార నదీతీరంలో ఉన్న పడవను ధ్వంసం చేశాయి.
Drinking water crisis చుట్టూ ఎత్తయిన కొండల నడుమ జీవనం సాగిస్తున్న గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గుక్కెడు నీటికోసం సుమారు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తూరు మండలం అడ్డంగి పంచాయతీ దాపాకుల గూడ గ్రామ గిరిజనులు వేసవి వేళ.. తాగునీటి కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
ఏడాదిన్నర కాలంలో చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెలగబోసిందేంటని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Chandanabhishekam as a Visual Feast పార్వతీపురం ప్రధాన రహదారిలోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం కనులపండువగా చందనోత్సవం నిర్వహించారు. ప్రధాన అర్చకుల వేదమంత్రోశ్చరణల మధ్య స్వామి వారికి విశేష పూజలు చేశారు.
Mother and daughter Suicide నాలుగు రోజుల కిందట ఓ బాలిక విశాఖ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాజాగా ఆ బాలిక అమ్మ, అమ్మమ్మ(తల్లీకుమార్తెలు) శ్రీకాకుళం మండలం గూడెంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. తల్లీకుమార్తెలిద్దరూ మెడకు చున్నీ బిగించుకుని బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఆదివారం ఉదయం వెలుగుచూసింది.
జాతీయ రహదారి బీర్లు పరిశ్రమ సమీపంలో ఈ నెల 25వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందినట్టు ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.
New Pensions from 1st జిల్లాకు కొత్తగా మంజూరైన 1521 వితంతు పింఛన్లను వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోలీసులు గ్రామాల ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మాదారం పోలీసులు, మంచిర్యాల మెడి లైఫ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్తో కలిసి ప్రారంభించారు.
కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్రోడ్డు మీదుగా టవర్క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం నాలుగో రోజు వసంతోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రధా న అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యు లు చెన్నకేశవ స్వామి మూలవిరాట్కు వసంతం చల్లి అనంతరం ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు.
అధికారుల నిర్లక్ష్యంతో 22ఏలో చేరిన పట్టాభూములు ఏళ్ల తరబడి క్రమబద్ధీకరణకు నోచుకోక హక్కుదారులు అల్లాడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ పనులు జరగకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు 22ఏలో నుంచి తొలగిస్తామని రైతుల వద్ద లక్షలాది రూపాయల ముడుపులు తీసుకొని పనులు చేయకుండా వెళ్లిపోయారు.
మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు.
మండలంలోని కుందంపల్లి రోడ్డు అధ్వానంగావు ఉంది. ఏడేళ్ల కిందట చేపట్టిన పనులు నేటికి కూడా మొదలు పెట్టిన పాపాన పోలేదు. దీంతో నిత్యం ప్రజలు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కుందంపల్లికి రోడ్డు ఏప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల కిందట వైసీపీ పాలకులు తట్టెడు మట్టిని వేసిన పాపాన పోలేదు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక ట్రెజరీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి.
కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి నిరసనగా ఆదివారం పెద్దబస్టాండ్ సెంటర్లో టీడీపీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడురోజుల సంతాపదినాల్లో భాగంగా మౌనదీక్ష కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రసూల్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం దారుణమన్నారు.
ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి అ న్నారు. ఆదివారం అమ్మవారిశాల కమిటీ చైర్మన్ వాడకట్టు రంగసత్యనారాయణ ని వాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అశోక్రెడ్డి పాల్గొన్నా రు. ఈసందర్భంగా అశోక్రెడ్డి మాట్లాడు తూ పట్టణంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇ చ్చారు.
మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు.
తాగు నీటి కోసం మండలంలోని పెద్ద యాచవరం గ్రామస్థులు కటకటలాడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో గ్రామంలో ఉన్న బోర్లు అధిక శాతం నీరు లేక ఒట్టి పోయాయి. దీంతో గ్రామంలో నీటికష్టాలు మొదలయ్యాయి. నీటి కోసం గ్రామ శివారులో ఉన్న సింగిల్ పేస్ మోటార్ ద్వారా అరకొరగా వచ్చే నీటి కోసం వేచి ఉండి నీటిని బైకులపై, తోపుడు బండ్లపై, నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు వాపోతున్నారు.