సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల వద్ద శనివారం భూనిర్వాసిత కుటుంబం ఆందోళనకు దిగింది. సుల్తాన్పూర్ శివారులోని సర్వేనంబర్ 40/ఈ లోని 3.05 ఎకరాల భూమి జేఎన్టీయూ న
ఆపరేషన్ సిందూర్పై కొలంబియా ఇచ్చిన అసంతృప్తి ప్రకటనను ఉపసంహరించుకుంది. భారత బృందం చేసిన దౌత్య పర్యటన విజయవంతం కాగా, కొలంబియా ఉగ్రవాదంపై భారత వైఖరికి మద్దతు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ముడి వంటనూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని సగానికి తగ్గించింది. దీని ద్వారా రిటైల్ ధరలను తగ్గించి, దేశీయ తయారీదార్లకు రక్షణ కల్పించాలని ఉద్దేశం.
Operation Sindhur Symbolizes Indian Valor, PM Modi’s Strong Message to Pakistan, Largest Anti-Terror Operation in India’s History, Honoring Queen Ahilyabai Holkar’s Legacy in Women Empowerment
ఆయిల్పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంత భారత యుద్ధ విమానాలు కోల్పోయినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. కానీ తప్పులనుంచి నేర్చుకుని వెంటనే దాడులు కొనసాగించి పాక్ పై భారీ దెబ్బతీశామని చెప్పారు.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిన�
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సహా 27 మంది మృతికి నిరసనగా జూన్ 10న దేశవ్యాప్త బంద్కు సీపీఐ(మావోయిస్టు) పిలుపునిచ్చింది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని కూడా కోరారు.
దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతూ శనివారం నాటికి 3,395కి చేరుకున్నాయి. కేరళలోనే అత్యధికంగా 1,336 కేసులు నమోదవగా, ఢిల్లీ, మహారాష్ట్రలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.24 మేర తగ్గించాయి. తాజా ధర రూ.1,730.50గా ఉండగా, ఈ నిర్ణయం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది.
నైజీరియాలో కుండపోత వర్షాలకు భారీ వరదలు ఏర్పడి మోక్వా పట్టణాన్ని ముంచేశాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసమై 150 మందికి పైగా మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం నిర్మించలేదని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్లూపీఆర్ఎస్) నిగ్గుతేల్చింది.
ఆయిల్పామ్ రైతులకు కేంద్రం షాకిచ్చింది. సుంకం తగ్గింపు రూపంలో వారి నెత్తిన పిడుగు వేసింది. ప్రస్తుతం 27.5 శాతంగా ఉన్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించింది.
అధిక వడ్డీల పేరుతో ప్రజ ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి, ఖాతాదారులకు డబ్బు లు చెల్లించకుండా బోర్డు తిప్పేసిన పెంగ్విన్ సెక్యూరిటీస్ నిర్వాహకురాలు స్వాతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్కు భారీ స్పందన లభించింది. 3.35 లక్షల మంది 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాపు కాస్తడనుకున్నాం... కానీ మమ్మల్ని కాష్టంలో పెట్టే పరిస్థితి తీసుకువస్తున్నడు. తమ ఊరిప్రక్కనే ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే కష్టాల నుంచి బయట పడేస్తడనుకున్నం.
[04:20]అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజే ఓ ప్రభుత్వ వైద్యురాలు సస్పెండయ్యారు. తమిళనాడులోని తెన్కాశి జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు శ్రీపద్మావతి రోగులకు ఆహారం అందించడానికి ఆకుకూర కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 21 నాటికి 2 కోట్ల మంది భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టగా, ఇప్పటికే 1.13 కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికా అంతా సిద్ధమైంది. భారీ సభకు ఆ దేశంలోని డాలస్ నగరం ముస్తాబైంది. వైదికైన అక్కడి డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం గులాబీమయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఒకవైపు �
మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస
మీ ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఇలా అన్నిటికీ ఓటీజీ డ్రైవ్ వాడుకోవాలని ఉందా? అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపయోగపడేది ఈవీఎం ఎన్స్టోర్ 4-ఇన్-1 ఓటీజీ ఫ్�
అదో పాత గుడి. సంప్రదాయానికి ప్రతీకగా ఉంది. దాని పరిసరాల్లో రకరకాల ఫొటో షూట్లు జరుగుతున్నాయి. ఒకవైపు పిల్లాడి తొలి పుట్టినరోజుకు సంబంధించిన ఫొటో షూట్. ఓ నలుగురు డ్యాన్సర్లు తల మీద తళుకుబెళుకు ప్లాస్టిక్�
దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులూ ఉపయోగిస్త. పెట్టుబడులను ఆకర్షించ�
‘బేబీ’ఫేం సాయి రాజేష్ కథను అందిస్తూ, మరో నిర్మాత ఎస్కేఎన్తో కలిసి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటల్, గ్లింప్స్ రేపు విడుదల చేయనున్నట్టు మ�
[04:19]తమిళనాడులో కొవిడ్ సోకి ఓ యువకుడు మృతిచెందాడు. సేలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వివరాల మేరకు.. మేట్టూరుకు చెందిన యువకుడు (25) కొన్ని రోజుల కిందట జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
నామినేటెడ్ సభ్యులను పదవీ కాలం ముగించకముందే రాజీనామా చేయమని కోరడం లేదా తొలగించడం ప్రభుత్వానికి చట్టపరంగా సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తూ పలువురు కలెక్టర్లు ఇచ్చిన తొలగింపు ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం అమాన్యం చేసింది.
[04:18]శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని పెట్రోలు బంకులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పంపు బాయ్గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారు.
[04:15]ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం ఆరు పతకాలు (3 రజతాలు, 3 కాంస్యాలు) ఖాతాలో చేరాయి. మొత్తంగా 24 పతకాలతో (8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో మన దేశానికి ఇది ఉత్తమ ప్రదర్శన.
[04:17]రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఏపీ లాసెట్-2025ను నిర్వహించనున్నట్లు ఆ సెట్ ఛైర్పర్సన్ ప్రొఫెసర్ వి.ఉమ తెలిపారు.
ఆధ్యాత్మిక వైభవం చెంతనే ఆహ్లాద సోయగం! యాదగిరిగుట్ట క్షేత్రం అతి సమీపంలోని రాయగిరి చెరువు వద్ద రెండెకరాల్లో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేలా మినీ శిల్పారామం రూపుదిద్దుకుంది.
ఆపరేషన్ కగార్లో భాగంగా జరుగుతున్న ఎన్కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు శాంతి చర్చలకు స్పందించకుండా హింసను కొనసాగిస్తున్నాయని అభయ్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
[04:13]ఇంగ్లాండ్ లయన్స్తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 557 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 409/3తో రెండో రోజు, శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. మరో 142 పరుగులు జోడించి లంచ్ తర్వాత ఆలౌటైంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు రెండు పంటలు పండించుకుంటుంటే, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసేవాళ్లు కొందరు ఏం తింటున్నారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి మూల్యాంకనంపై జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారని, తానే దానిని గాడిలో పెడుతున్నానన్నారు.
ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ నివారణ కోసం బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి చర్యలు తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో పీ4 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలు కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.
[04:11]సింగపూర్ ఓపెన్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఈ భారత జోడీ 21-19, 10-21, 18-21తో మలేసియాకు చెందిన ఆరోన్ చియా, సో వూయి ఇక్ జోడీ చేతిలో పరాజయంపాలైంది.
[04:10]ఫ్రెంచ్ ఓపెన్లో ఇటలీ స్టార్ యానెక్ సినర్ దూసుకెళ్తున్నాడు. ఈ టాప్సీడ్ అలవోకగా ప్రిక్వార్టర్స్లో ప్రవేశించాడు. శనివారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అతడు 6-0, 6-1, 6-2తో లెహెకా (చెక్)ను చిత్తు చేశాడు.
కళ్యాణ్గారు మితభాషి అయినా, సీవీఎల్ఎన్ ప్రసాద్ కాస్ట్యూమ్ డిజైనింగ్లో చూపిన పట్టుదల, నైపుణ్యాన్ని గౌరవించారు. ప్రసాద్కి ఈ ప్రశంస జీవితంలో అతి పెద్ద ప్రోత్సాహం.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసులో విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనను రాత్రికి జైలుకు తిరిగి తరలించారు.
[04:08]క్రికెట్లో ప్రాథమిక అంశాలు చాలా కీలకమని కౌంటీల్లో ఆడినప్పుడు అర్థం అయిందని యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అన్నాడు. ‘‘ఇప్పటిదాకా ఏడు కౌంటీ మ్యాచ్ల్లో ఆడా. ఇదో గొప్ప అనుభవం.
[04:07]64 గడుల బోర్డు ముందు గంటలు గంటలు గడిపే చెస్ తారలకు కాసేపు విరామం. తుపాకులు చేతబట్టారు. పొడవాటి బూట్లు తొడిగారు. స్టయిల్గా పెద్ద టోపీలు పెట్టారు. కౌబాయ్, కౌగర్ల్స్ మాదిరిగా మారిపోయారు.
మాచర్ల మాజీ చైర్మన్ తురకా కిశోర్పై హత్యాయత్నం కేసులో గురజాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు, కిశోర్ను తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.
[03:30]విమానాల తయారీలో బోయింగ్ (అమెరికా), ఎయిర్బస్ (ఐరోపా) ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా కొనసాగుతున్నాయి. 90% మార్కెట్ వాటా ఈ సంస్థలదే. ఎంబ్రాయర్ (బ్రెజిల్) కూడా కొంతమేర మార్కెట్ను పొందింది. పొరుగుదేశమైన చైనా కూడా గతేడాది సొంత విమానాన్ని ఆవిష్కరించింది.
భూ సర్వే పంచనామా ధ్రువీకరణ పత్రం జారీకి ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ల్యాండ్ సర్వేయర్ మల్లోజు నాగరాజును ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.
పోలవరం-బనకచర్ల రెగ్యులేటర్ పథకంపై కేంద్రం ఆర్థిక శాఖకు సవివర వివరాలు కోరింది. రూ.81,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రైతులకు, తాగునీటి సరఫరాకు ఎంతగానో సహాయపడుతుందన్న దిశగా రాష్ట్ర అధికారులు కేంద్రానికి వివరాలు అందించనున్నారు.
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఫీజుపై ఇస్తున్న 25శాతం రాయితీ పథకాన్ని జూన్ చివరి వరకు కొనసాగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
పదో తరగతి పరీక్షల మూల్యాంకనలో తక్కువ పొరపాట్లు మాత్రమే జరిగాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ద్వారా కొంతమందికి మార్కులు మారినప్పటికీ, ఇది మొత్తం పేపర్లలో స్వల్పశాతం మాత్రమే అని వివరించారు.